” తండ్రిని చంపారు కానీ .ఆయన మాలో జీవించే ఉంటాడు..మీ దమ్ముంటే నా ముందుకు రండి ..ముఖాముఖి చర్చలకు సిద్ధమై…రండి మీ సంగతి చూస్తా…”మొన్న కశ్మీర్లో ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్న ఎంఎల్ బింద్రా తనయ శ్రద్ధా మాటలివి. ఉగ్రవాదులకు సవాల్ విసురుతూ ఆమె అన్న మాటల్ని షేర్ చేశారు కశ్మీర్ పోలీసు అధికారి ఇంతియాజ్ హుస్సేన్.
“ఇలాంటి ఆడబిడ్డలకు ఈనేల జన్మనిచ్చినంతకాలు పిరికిపందలైన టెర్రరిస్టులు ఎన్నటికీ విజయం సాధించలేదు” అంటూ శ్రద్ధా వీడియోను జతచేస్తూ ట్వీట్ చేశారాయన. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కశ్మీర్ పండిట్ అయిన తన తండ్రిని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులకు సవాలు విసిరిన శ్రద్ధాను వీరనారితో పోలుస్తున్నారు నెటిజన్లు.

Makhan Lal Bindroo(file photo)