తాము అధికారంలోకి వస్తే ముస్లింల కోసం ప్రత్యేకంగా ఇస్లామిక్ బ్యాంకును ఏర్పాటు చేస్తామని టీడీపీ నాయకుడు నారాలోకేశ్ ప్రకటించారు. మైనారిటీలకు ముఖ్యంగా పేద ముస్లింలకు అండగా ఉంటామన్నారు. జగన్ ముస్లిం కమ్యూనిటీ సంక్షేమాన్ని అస్సలే పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. లోకేష్ యువగళం పాదయాత్ర తిరుపతి జిల్లాలో కొనసాగుతోంది. కేవలం ముస్లింలనే కాదు అన్ని వర్గాలను మోసం చేసిన జగన్ సర్కారును సాగనంపాలని పిలుపునిచ్చారు. లోకేష్ యాత్ర గురువారానికి నాలుగువందల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.
మేం అధికారంలోకి వస్తే ఇస్లామిక్ బ్యాంక్ – పేద ముస్లింలకు అండగా ఉంటాం : లోకేశ్
Share: