తాలిబన్లు ఉగ్రవాదులైతే…గాంధీ,నెహ్రూలూ ఉగ్రవాదులే: అర్షద్ మదానీ జమైత్ ఉలేమా-ఇ-హింద్ ప్రెసిడెంట్ , దరుల్ ఉలూమ్ దేవ్ బంద్ ప్రిన్సిపల్ కూడా అయిన అర్షద్ మదానీ తాలిబన్లను స్వాతంత్ర్య సమరయోధులుగా అభివర్ణించాడు. తాలిబన్ ను ఉగ్రవాద సంస్థగా తాను అంగీకరించబోనన్నాడు. పోరాడడం తీవ్రవాదం అయితే బ్రిటీష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూలు కూడా తీవ్రవాదులేనను అర్షద్ అన్నారు. యూపీలోని దేవ్ బంద్ నుంచే తాలిబన్లు ప్రేరణ పొందినట్టు చెబుతారు.
ఆఫ్గనిస్తాన్ ను కైవసం చేసుకున్న తాలిబన్లను మంచిసంస్థగా ప్రచారం చేసేందుకు సర్వశక్తులా ప్రయత్నిస్తున్నారు కొందరు రాజకీయ నాయకులు, ముఖ్యంగా వామపక్ష మీడియా. ఇస్లామిజానికి కట్టుబడి నడిచే దేవ్ బంద్ బ్రాండ్ నే తాలిబన్, దారుల్ ఉలూమ్ అనుసరిస్తున్నాయి. యూపీలోని సహరాన్పూర్ జిల్లాలో దేవ్ బంద్ దారుల్ ఉలూమ్ ముఖ్య కేంద్రం ఉంది. ఈ ప్రాంతంలోని యూపీ సర్కారు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఎలైట్ కమెండో యూనిట్ ను ఏర్పాటుచేయనుంది.