అయ్యప్ప, హనుమాన్ దీక్షలో ఉన్న పోలీసు సిబ్బందిని తెలంగాణ సర్కారు వేధిస్తోందని విశ్వహిందూపరిషత్ ఆరోపించింది. మాలలో ఉన్న సిబ్బంది చెప్పులు వేసుకోవాలని, జుట్టు, గెడ్డం కత్తిరించుకోవాలని డీజీపీ మెమో ఇవ్వడాన్ని తప్పుపట్టింది. చెప్పులో షూసో వేసుకోకుంటే ఈ రాష్ట్రంలో సెక్యులరిజానికి వచ్చే ముప్పేంటని ప్రశ్నించారు తెలంగాణ ప్రాంత అధికార ప్రతినిధి రావినూతల శశిధర్. రంజాన్ మాసంలో ముస్లింలకు ప్రార్థనలకు అనుమతిస్తారని… డిపార్ట్ మెంట్ అధికారికంగా వారి నిధులతో ఇఫ్తార్ విందులు ఇస్తారని..కానీ అయ్యప్ప స్వాములకు భిక్షకు కూడా సమయం ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.