ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమన్ ఏఐఎంఐఎం దూకుడు పెంచింది. ఈ ఎన్నికల్లో బాబూ సింగ్ కుష్వాహా, భారత్ ముక్తిమోర్చా పార్టీలతో పొత్తును దాదాపు ఖరారు చేసుకుంది ఎంఐఎం. తమ కూటమి అధికారంలోకి వస్తే ఇద్దరు ముఖ్యమంత్రులను ఎంపిక చేశామని అసద్ ప్రకటించారు. ఓబీసీకి చెందిన ఒకర్ని, దళిత సమాజిక వర్గానికి చెందిన ఒకర్ని ముఖ్యమంత్రులుగా చేసి… ముస్లిం సామాజికవర్గాలనికి చెందిన వ్యక్తితో పాటు మరో ఇద్దర్ని డిప్యూటీ సీఎంలుగా ఎంపిక చేస్తామన్నారు. గతంలో ఓం ప్రకాష్ రాజ్భర్కు చెందిన సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లు ఒవైసీ ప్రకటించారు. అయితే రాజ్భర్ ఆ కూటమిని విడిచిపెట్టి.. సమాజ్వాదీ పార్టీలో చేరిపోయారు. రాజ్ భర్ తమ కూటమి నుంచి వెళ్లిపోయినా 100 స్థానాల్లో తమ కూటమి పోటీ చేస్తుందని అసద్ స్పష్టం చేశారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందే యూపీలో ప్రచారం మొదలు పెట్టిన అసద్ రాష్ట్రమంతటా సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. యూపీలో ఏ రాజకీయ పార్టీ కూడా ముస్లింల అభివృద్ధికి పాటుపడలేదని…ముస్లింలకు యూపీలో తీవ్ర అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు.