పార్టీ ఆవిర్భావ సభ వేదిగ్గా బీజేపీతో పొత్తుపై జనసేన చీఫ్ క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో జనసేన పొత్తుపై కొంతకాలంగా భిన్నమైన చర్చలు జరుగుతున్నాయి. తాను బీజేపీతో పొత్తులో ఉంటే ముస్లింలు దూరం అవుతారని కొందరంటున్నారని… వారికి ఇష్టం లేకపోతే మాత్రం తాను బీజేపీకి దూరం జరుగుతాను అని పవన్ వ్యాఖ్యానించారు. ఎక్కడైనా మైనార్టీలపై దాడి జరిగితే చూస్తూ ఊరుకోబోనని..అందుకే వెంటనే పొత్తునుంచి వెనక్కి వస్తానని మాటిస్తున్నా అని పవన్ అన్నారు. ముస్లింలకు జగన్ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనసేన ఒంటరిగా వెళ్లేందుకు భయపడదని… అందరూ కలిసి రాకపోతే తానేం చేయలేనని అన్నారు. ఈసారి తాను ప్రయోగాలు చేయనని…పవన్ కల్యాణ్ సహా తనవాళ్లంతా అసెంబ్లీలో అడుగుపెట్టేవిధంగా రాజకీయం ఉంటుందన్నారు.
ముస్లింలు దూరం అవుతారనుకుంటే బీజేపీకి దూరం జరుగుతా : పవన్ కల్యాణ్
జనసేన ఒంటరిగా వెళ్లేందుకు భయపడదని… అందరూ కలిసి రాకపోతే తానేం చేయలేనని అన్నారు. ఈసారి తాను ప్రయోగాలు చేయనని…పవన్ కల్యాణ్ సహా తనవాళ్లంతా అసెంబ్లీలో అడుగుపెట్టేవిధంగా రాజకీయం ఉంటుందన్నారు.
Share: