బంపర్ ఆఫర్.. అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్ ధర రూ.60/- కే..!
ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రభావితం చేసేందుకు అనేక రకాల ప్రకటనలు చేయడం తెలిసిందే. తాజాగా కేరళలో బీజేపీ పార్టీ సంచలన ప్రకటన చేసింది. తాము అధికారంలోకి వస్తే.. లీటర్ పెట్రోల్ను కేవలం రూ.60/- అందిస్తామంటూ హామీ ఇచ్చింది. పెట్రోల్,డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తామని బీజేపీ సీనియర్ నేత కుమ్మనం రాజశేఖర్ తెలిపారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న సీపీఎం లెఫ్ట్ సర్కార్ పెట్రోల్,డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురావడం లేదని రాజశేఖర్ ప్రశ్నించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్,డీజిల్ ధరల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకుంటే జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తామని తెల్పిందని గుర్తు చేశారు. అంతేకాదు ఇప్పటికే అసోం రాష్ట్రంలో పెట్రోల్,డీజిల్ ధరలపై పన్నులను తగ్గించి ధరలను అరికట్టారన్నారు.