మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బిజెపి సర్వ శక్తులు ఒడ్డుతోంది. విడతల వారీగా జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటికే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కు సానుకూల పవనాలు వీస్తున్నాయి. కాబోయే దశల్లో కూడా బిజెపి పై చేయి సాధిస్తుందని అంచనా వేస్తున్నారు ఈ క్రమంలో పార్లమెంట్లో 400 సీట్లు సాధించాలని బిజెపి లక్ష్యంగా పెట్టుకొంది. ఈ లక్ష్యాన్ని చేరుకుంటే చాలా పనులు జరుగుతాయని బిజెపి సీనియర్ నాయకులు అసోం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వాశర్మ వెల్లడించారు.
పార్లమెంట్లో 400 సీట్లు సాధించినట్లయితే బిజెపి లక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయని ఆయన అన్నారు 300 సీట్లు వచ్చినప్పుడే అయోధ్యలో రామ మందిరం సాకారం అయిందని ఇప్పుడు 400 సీట్లు దక్కించుకున్నాక మధురలో శ్రీకృష్ణ జన్మభూమి వారణాసిలో ఈశ్వర జన్మభూమిని కూడా దక్కించుకొంటామని ఆయన అన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరు భారత్లో చేరడం తద్యమవుతుందని హేమంత్ అంటున్నారు ఒకప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ పేరు చెప్పాలంటే ప్రభుత్వ పెద్దలు భయపడే వారని,, ఇప్పుడు ఆ పరిస్థితి పోయిందని ఆయన అన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఇప్పుడు ఏమి జరుగుతుందో తెలుస్తోందని ఆయన వివరించారు ఒకవైపు ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో శాంతియుత వాతావరణం నెలకొందని.. హేమంత్ ఉదాహరణలతో సహా వివరించారు కానీ పక్కనే ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ మాత్రం అగ్నిగుండం లా రగులుతోందని ఆయన పేర్కొన్నారు. భారత భూభాగంలో కలిసిపోతేనే అక్కడ శాంతి నెలకొంటుందని హేమంత్ స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి మోడీ సహా అనేకమంది బీసీ వర్గాల నుంచి వచ్చారని హేమంత్ గుర్తు చేశారు గడచిన పది సంవత్సరాలుగా ఎక్కడ రిజర్వేషన్ల ప్రక్రియను కదిలించలేదని ఆయన అన్నారు రాగల కాలంలో కూడా బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు స్పష్టంగా కొనసాగుతాయి అని తేల్చి చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో దొంగాట ఆడుతోందని ఆయన మండిపడ్డారు