రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆరోగ్యం కుదుటపడుతోంది. శనివారం నాడు ఢిల్లీ ఎయిమ్స్లోని ఐసీయూ నుంచి స్పెషల్ రూంకు తరలించారు. మార్చి 29వ తేదీన ఛాతిలో నొప్పి రావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. అన్ని రకాల టెస్టులు నిర్వహించిన తర్వాత.. 30వ తేదీన బైపాస్ సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని.. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుంచి స్పెషల్ రూంకు తరలించినట్లు అధికారులు తెలిపారు. అయితే కొద్ది రోజులపాటు ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.
https://twitter.com/ANI/status/1378221905463762946