అసోంకు చెందిన ఓ యువ ఐఏఎస్ అధికారిణి తన పనితీరుతో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆమెనే అసోం కచర్ జిల్లా డిప్యూటీ కమిషనర్ కీర్తి జల్లి. 2013 కేడర్ ఐఏఎస్ అధికారి. వరద సంక్షోభ సమయంలో ఆమె చేసిన సేవలు అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి. సామాన్యూలలో సమాన్యురాలైపోయి సహాయకచర్యల్లో ఉన్న ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు మాత్రమే కాదు గతంలోనూ తన నిరాడంబరత, చిత్తశుద్ధితో అందరి మన్ననలు పొందారామె. కరోనా సమయంలో ఈమె పెళ్లి హైదరాబాద్ లో జరగవలసి ఉంది. అయితే జిల్లాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి అని ఈ పరిస్థితుల్లో బాధ్యత విస్మరించి పెళ్లికి ఒక్క రోజు కూడా సెలవు పెట్టలేనని, వరుడు కి అభ్యంతరం లేక పోతే తను ఉంటున్న సిల్చర్ లోని తన అధికార నివాసానికి వస్తే పెళ్లి చేసుకుందామని వరుడికి వర్తమానం పంపింది. పెళ్లికొడుకు తరపువాళ్లు అందుకు అంగీకరించి అక్కడే పెళ్లి చేయించారు.