మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్ లో శిక్షణలో ఉన్న భారత వాయుసేనకు చెందిన రెండు ఫైటర్ జెట్లు కూలిపోయాయి. యుద్ధ విమానాలు పరస్పరం ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగింది.శిక్షణలో భాగంగా…మధ్యప్రదేశ్ లోని గ్వాలియల్ బేస్ నుంచి సుఖోయ్ 30, మిరాజ్ 200 విమానాలు గాల్లోకి ఎగిరిన కాసేపటికే కుప్పకూలాయి. పోలీసులు, రెస్క్యూ టీం వెంటనే వచ్చి సహాయక చర్యలు చేపట్టారు.. మెరెనా ప్రాంతంలో విమానాల శకలాలు కూలినట్టు గుర్తించారు. మిరాజ్లో ఒక్కరు, సుఖోయ్ లో ఇద్దరు పైలట్లు ఉన్నారు. వారిలో ఒకరు చనిపోగా..గాయాలైన ఇద్దరినీ హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఘటనపై వాయుసేన దర్యాప్తునకు ఆదేశించింది. ఘటన వివరాలు తెలిసిన వెంటనే కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్..వాయుసేన చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరితో మాట్లాడారు.అటు రాజస్థాన్ భరత్ పూర్లో కొన్ని విమానశకలాలను గుర్తించారు.ముందు చార్టెడ్ ఫ్లైట్ అనుకున్నారు. కానీ వాయుసేనకు చెందిన యుద్ధవిమానమే అని రక్షణ శాఖ అధికారులు నిర్థారించారు. మధ్యప్రదేశ్ లో మొదలై కుప్పకూలిన విమానానికి చెందిన శకలాలని భావిస్తున్నారు.
https://twitter.com/AwadheshMishra_/status/1619220623972274177?s=20&t=GEbMbqLwcWINI5S_DPi3sg