పంజాబ్ ను పూర్తిగా ఊడ్చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. పార్టీ సీఎం అభ్యర్థి ధురి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం తేదీని పార్టీ త్వరలోనే ప్రకటించనుంది. అయితే రాజ్ భవన్లో కాక… తన పూర్వీకుల గ్రామం, భగత్సింగ్ పూర్వీకుల గ్రామం కూడా అయిన నవాన్షహర్ జిల్లాలోని ఖట్కర్కలన్లో ప్రమాణం చేస్తానని ఆయన తెలిపారు.