అనారోగ్య కారణాలతో కన్నుమూసిన పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ను శాంతిశక్తిగా తాను పేర్కొనడాన్ని సమర్ధించుకున్నారు శశథరూర్. చనిపోయిన వ్యక్తి గురించి మంచిమాటలే చెప్పే ఇండియాలో తాను పెరిగానన్నారు. థరూర్ వ్యాఖ్యలపై బీజేపీ సోషల్మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. సంతాపం తెలిపే ముసుగులో అతిగా పొడిగారని, కార్గిల్ యుద్ధం ముషారఫ్ వల్లే జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాడెన్, తాలిబన్లను ప్రశంసించిన పర్వేజ్ ముషారఫ్… రాహుల్ గాంధీని పెద్ద మనిషి అంటూ ప్రశంసించారనీ, శశిథరూర్ పొగడ్త కూడా ఆ కోవలేనిదేనని బీజేపీ తప్పుపట్టింది.
అయితే తన వ్యాఖ్యలపై శశిథరూర్ వివరణ ఇస్తూ.. చనిపోయిన వారి గురించి రెండు మంచి మాటలు చెప్పడం ఇండియాలో ఆనవాయితీ అని…తాను ఇక్కేడే పెరిగాననీ అన్నారు. ముషారఫ్ బద్ధ శత్రువే కావచ్చు, కార్గిల్ యుద్ధానికి బాధ్యుడే కావచ్చు, కానీ ఆయన ఐచ్ఛికంగా 2002 నుంచి 2007 వరకూ ఇండియాతో శాంతి కోసం ప్రయత్నాలు చేశారని మరోసారి సమర్థించుకున్నారు. . ”ఆయన మిత్రుడు కాదు. శాంతి వల్ల వ్యూహాత్మక ప్రయోజనాలు ఉంటాయి. మనం చేస్తున్న ప్రయత్నాలు కూడా అవే” అని శశిథరూర్ తన తాజాగా ట్వీట్ చేశారు.