నరేంద్రమోదీ ప్రధాని అయ్యాకే లబ్ది పొందుతూ, ఎదిగారంటున్న ఆరోపణలకు గట్టిగా బదులిచ్చారు భారత వ్యాపార దిగ్గజం గౌతమ్ ఆదానీ. ఆదానీ గ్రూప్ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఓ ఇంగ్లిష్ మీడియాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారాయన. తాను 30ఏళ్ల క్రితం రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో వ్యాపారం మొదలుపెట్టానని..అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చానని అన్నారు. తన వ్యాపారాభివృద్ధికి ఏ ఒక్క రాజకీయ నాయకుడికీ ముడిపెట్టవద్దనీ అన్నారు. మోదీ వల్లే లబ్ది పొందానన్నది కేవలం ఆరోపణ మాత్రమేన్న ఆదానీ… ఇద్దరం ఒకే రాష్ట్రానికి చెందిన వాళ్లం కనుకే ఆరోపణలు చేస్తున్నారని..ఇది దురదృష్టకరమని అన్నారు.