శ్రద్ధాను దారుణంగా చంపి ముక్కలు చేసిన ఆఫ్తాబ్ అమీన్ ఆమెను చంపినందుకు తానేం పశ్చాత్తాపపడడం లేదన్నాడు. విచారణలో భాగంగా అతనికి పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు. నేరాన్ని అంగీకరించిన ఆఫ్తాబ్..అందుకు తాను బాధపడడం లేదని తెలిపినట్టు దర్యాప్తుసంస్థలు వెల్లడించాయి. శ్రద్ధను చంపి డెడ్ బాడీని ముక్కలు చేసినట్టు మరోసారి అంగీకరించిన ఆఫ్తాబ్…తనకు మరికొందరు అమ్మాయిలతోనూ సంబంధాలున్నాయని ఒప్పుకున్నాడు. పాలీగ్రాఫ్ పరీక్ష సందర్భంగా ఆఫ్తాబ్ ప్రవర్తన సాధారణంగానే ఉందని విచారణాధికారులు తెలిపారు. ముందునుంచే ఎప్పుడు అడిగినా శ్రద్ధను చంపినట్టు అంగీకరిస్తూవచ్చాడు ఆఫ్తాబ్. నేరాన్ని ఒప్పుకున్న ఆఫ్తాబ్ అందుకు కనీసం పశ్చాత్తాపపడకపోవడం చూసి అధికారులు ఆశ్చర్యపోతున్నారు.
ఇక నార్కో పరీక్షలకు కూడా కోర్టు అనుమతివ్వడంతో అందుకు దర్యాప్తు బృందం సిద్ధమవుతోంది. డిల్లీలోని రోహిణి ఆస్పత్రి ఫోరెన్సిక్ ల్యాబ్ లో డిసెంబర్ 1, 5తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఆఫ్తాబ్ చెప్పిన అటవీప్రాంతంనుంచి కొన్ని శరీర భాగాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు డీఎన్ఏ టెస్టుకు పంపిన సంగతి తెలిసిందే. డీఎన్ఏ రిపోర్ట్ వస్తే కేసు దర్యాప్తు మరింత ముందుకెళ్లే అవకాశం ఉంది.