దేశ సరిహద్దు భద్రతలోనే కాదు.. దేశం లోపల కూడా రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోశిస్తుంటారు సీఆర్పీఎఫ్ జవాన్లు. అలాంటి సీఆర్పీఎఫ్ జవాన్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. సీఆర్పీఎఫ్ జవాన్లలో కూడా వర్గాలు ఉంటాయన్న అర్ధం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. నాలుగో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా కుచ్బిహార్లో దీదీ పాల్గొన్నారు. టీఎంసీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఓ సభలో పాల్గొన్న మమతా.. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాదు.. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఇలాంటి వాతావరణం ఈసీ కల్పించాలన్నారు.
ఈ క్రమంలో రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలకు బందోబస్తు కోసం వచ్చిన సీఆర్పీఎఫ్ జవాన్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వీరంతా బీజేపీ సీఆర్పీఎఫ్ అని.. వీరికి గౌరవమివ్వమంటూ వ్యాఖ్యానించారు. అయితే తాము కేవలం నిజమైన జవాన్లకే గౌరవమిస్తామంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల వద్ద హంగామా సృష్టిస్తూ.. ప్రజలను హింసిస్తూ.. మహిళలపై దాడులకు దిగుతున్నారని సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆరోపణలు చేశారు. వీరంతా బీజేపీ సీఆర్పీఎఫ్ అంటూ వ్యాఖ్యానించడం హాట్టాపిక్గా మారింది.
https://twitter.com/ANI/status/1379717128761176069