కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానిని విమర్శించేందుకు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలు పెట్టినట్టున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ గురించి ఆయన ఒక్కమాట కూడా మాట్లాడలేదని మండిపడ్డారు. దేశ పరిస్థితులపై ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతూ ఇతరదేశాలతో పోలుస్తూ దేశాన్ని అవమానిస్తున్నారనీ కిషన్ రెడ్డి అన్నారు.తనవి తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తానని కేసీఆర్ మళ్లీ అన్నారని…ఆయన అసెంబ్లీ వేదిగ్గా చెప్పిన లెక్కలపై చర్చకు తాను సిద్ధమని కిషన్ రెడ్డి అన్నారు. చర్చ ప్రెస్ క్లబ్ లోనా, ప్రగతి భవన్లోనా, ఫామ్ హౌస్ లోనా లేక అమరవీరుల స్తూపం దగ్గరా అన్నది తానే చెప్పాలని కిషన్ రెడ్డి సవాల్ చేశారు.
చర్చకు నేను సిద్ధం, ఎక్కడ కూర్చుందాం – కేసీఆర్ కు కిషన్ రెడ్డి సవాల్
Share: