ప్రధాని పదవికి తానేం హక్కుదారును కానని… ఆ కోరిక కూడా నాకు లేదని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. విపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థి నితీశేనన్న వార్తలపై ఆయన స్పందించారు. ఢిల్లీ పర్యటనల ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ నితీశ్ సీపీఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరీతో సమావేశమయ్యారు. బీజేపీతో సంబంధం తెంచుకున్న తరువాత మొదటిసారి డిల్లీ పర్యటనకు వెళ్లిన నితీష్ పలువురు విపక్ష పార్టీలనేతలతో వరుసగా సమావేశం అవుతున్నారు. కాంగ్రెస్ సహా… వామపక్షపార్టీలు, వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని ఆయన ఆకాంక్షించారు. సీపీఐ కార్యాలయంలో డి. రాజానూ ఆయన కలిశారు. జేడీఎస్ నేత కుమారస్వామినీ కలుసుకోనున్నారు. రెండురోజుల క్రితం కేసీఆర్, నితీశ్ భేటీ అయిన సంగతి తెలిసిందే.