ఆంగ్లంలో indianexpress లో వచ్చిన చిదంబరం వ్రాసిన వ్యాసం లోని విషయాలను గమనిస్తే” ఒక ప్రక్క నేను ఒక హిందువుగా జన్మించాను, ఒక హిందువుగా పెరిగాను, నా జీవితమంతా నన్ను నేను హిందువుగానే పరిగణించుకుంటాను’ తాము హిందువులుగా పుట్టి హిందువులగా పెరిగామని, ప్రస్తుతం తమను తాము హిందువులుగా గుర్తించుకుంటున్నామని ఇటీవల ప్యూ సర్వేలో వెల్లడించిన 81.6% మంది హిందువులలో నేనూ ఒకడినని నేను విశ్వసిస్తున్న, నేను ఆచరిస్తున్న హిందూధర్మంతో చాలా సంతృప్తిగా, ఆనందంగా ఉన్నాను. ప్రాచీన తమిళ కవి కనియాన్ అన్నట్టు ‘ప్రతి ఒక్కరూ నా బంధువే’. మరి హిందూత్వ అవసరం నాకేంటి?. అనేది చిదంబరం ప్రశ్న.
అట్లాగే తమిళులలో అత్యధికులు, హిందూధర్మాన్ని మనసా వాచా కర్మణా ఆచరిస్తున్న కుటుంబాలలో జన్మించినవారే. గ్రామీణ దేవతలతో సహా అనేక మంది వేల్పులను వారు ఆరాధిస్తారు. పొంగల్, దీపావళి లాంటి పండుగలను ఎనలేని ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. పాల్ కుడమ్, కావాడి మొదలైన ఆచారాలను భక్తితత్పరతతో పాటిస్తారు. తమిళ హిందువులు శతాబ్దాలుగా హిందూయేతర మతాలను అనుసరిస్తున్న వారితో తోబుట్టువుల వలే సహజీవనం చేస్తున్నారు. రెండు వేల సంవత్సరాలుగా క్రైస్తవం, ఎనిమిది వందల సంవత్సరాలుగా ఇస్లాం తమిళుల జీవన ప్రాంగణాలలో పరిఢవిల్లుతున్నాయి. తమిళ భాషను కాలానుగుణంగా ఆధునికీకరించిన వారిలోనూ, తమిళ సాహిత్యాన్ని సమున్నతం చేసిన వారిలోనూ ముస్లిం, క్రైస్తవ విద్వాంసులు, రచయితలు చాలామంది ఉన్నారు. నాకు తెలిసినంతవరకు తమిళ హిందూ రాజన్యులు ఎవరూ హిందూమత ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు ఇతర మతాలపై ఏ విధమైన యుద్ధమూ చేయలేదు.” అట్లా తమిళనాడు లోనే కాదు దేశమంతా అదే కనబడుతుంది ఎందుకంటే అది మన నైజం
అట్లాగే తమిళ సంస్కృతీ హిందూ సంస్కృతే అని కూడా చెప్పాడు దానివివరాలు ” క్రీస్తుపూర్వం 6వ వ శతాబ్ది నుంచి క్రీస్తు శకం 1వ వ శతాబ్ది దాకా వర్థిల్లిన సంగం యుగకవి కోకిలల్లో కనియాన్ పూన్గున్రానర్ ఒకరునేను ఇప్పుడు తమిళనాడులోని రామనాథపురం జిల్లా శివగంగై జిల్లాలోని ఒక గ్రామంలో జన్మించాను. కనియన్ పూంగున్రానార్ అదే జిల్లాలోని పూంగున్రం (ప్రస్తుతం మహిబాలన్పట్టి) అనే గ్రామంలో కొన్ని కిలోమీటర్ల దూరంలో జన్మించినందుకు నేను గర్విస్తున్నాను . యాదమ్ ఊరే యావారంకెలిర్ప్రతి ప్రదేశమూ నా గ్రామమేప్రతి ఒక్కరూ నా బంధువే) అన్న స్ఫూర్తిదాయక సత్యవచనంతో ప్రారంభమయే ఒక 13 పంక్తుల కవిత కనియాన్ యశోచంద్రిక. నిజానికి ఆ కవిత అంతా ఒక మానవతా సంవేదన. సార్వకాలికసార్వజనీన భావస్రోతస్సు. ఆ కవితలోని మొదటి పంక్తి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయ కుడ్యంపై అంతర్లిఖితమై ఉంది. 2000 సంవత్సరాలకు పూర్వం తమిళుల జీవన విధానాన్ని ఆ పద్యం ప్రతిబింబిస్తుందని విద్వజ్ఞులు విశ్వసిస్తున్నారు
1936లో డాక్టర్ అంబేడ్కర్ ‘కుల నిర్మూలన’ అనే వెలువరించని ప్రసంగంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (1885లో స్థాపితం), ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ (1887లో స్థాపితం) మధ్య విభేదాల మూలాలను వివరిస్తూ ‘సాంఘిక సంస్కర్తల’ కంటే ‘రాజకీయ సంస్కర్తల’ ప్రభావ ప్రాబల్యాలే అధికంగా ఉండడం పట్ల విచారం వ్యక్తం చేశారు. రాజకీయ దృక్పథంతో ఆలోచించే హిందువులకు ఆయన కొన్ని ప్రశ్నలు వేశారు. ‘ప్రజలు తమకు ఇష్టమైన దుస్తులు ధరించేందుకు, ఆభరణాలు పెట్టుకునేందుకు అనుమతించని మీరు రాజకీయ అధికారం చెలాయించడానికి అర్హులేనా? ప్రజలు తాము ఇష్టపడే ఆహారాన్ని తినేందుకు అనుమతించని మీరు రాజకీయ అధికారానికి అర్హులేనా?
ఎంత వాస్తవమైనవి ఈ ప్రశ్నలు అవును భారత దేశం లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఎన్నికలు, ఓట్లు వచ్చిన తరువాత స్వాతంత్రం రాక పూర్వం నుండే అధికారం కోసం మాట్లాడే భాష మారటం ప్రారంభమైనది అది ఎంతవరకు వెళ్ళింది అంటే వేల సంవత్సరాలుగా ఉన్న దేశం పేరే మార్చేవరకు.ప్రస్తుతం ఆ రాజకీయం అధికారం కోసం ఎట్లా మాట్లాడిస్తున్నదంటే హిందువు మతసహనం కలవాడు వేల సంవత్సరాలనుండి హిందూ మతమే నిజమైన మతం అన్న స్వోత్కర్ష ఆ మతానికి లేనే లేదు ‘ప్రపంచానికి సహన భావమూ, విశ్వజనీన ఆమోదమూ రెండూ బోధించిన మతానికి చెందిన వాడినైనందుకు నేను గర్విస్తున్నాను. పరమత సహనాన్ని విశ్వసించడమే కాదు, అన్ని మతాలు నిజమైనవేనని కూడా మేము అంగీకరిస్తాం’ అని స్వామి వివేకానంద అన్నారు.
.పి చిదంబరంఇంకా ఇలా వ్రాశారు: హిందూమతానికి చర్చి లాంటి ఒక సువ్యవస్థిత సంస్థా నిర్మాణం కానీ, పోప్ లాంటి ఒక సర్వోన్నత ఆచార్యుడు కానీ, మహమ్మద్ లాంటి ఒక ప్రవక్త కానీ, ఒక పవిత్ర గ్రంథం కానీ, ఒకే ఆచారం గానీ లేనే లేవు. అనేకం నుంచి దేనినైనా ఎంపిక చేసుకునేందుకు లేదా అన్నిటినీ తిరస్కరించేందుకు హిందువుకు స్వేచ్ఛ ఉంది. హిందువు అయిన వ్యక్తి హిందూధర్మాన్ని ఆచరిస్తూనే ఆస్తికుడు గానూ, నాస్తికుడు గానూ, అజ్వేయవాది గానూ కూడా ఉండవచ్చని హిందూమత ప్రాజ్ఞులు అభిప్రాయపడ్డారు.అట్లాగే ప్రొఫెసర్ వెండీ డొనిజెర్ (షికాగో విశ్వవిద్యాలయంలో మత అధ్యయనాల విదుషీమణి) అర్ధశతాబ్దికి పైగా సంస్కృత భాషా సాహిత్యాలను, ప్రాచీన భారతీయ మతాలను అధ్యయనం చేస్తున్నారు. ‘పురాతన యుగాలలోని హిందువులు పశుమాంసాన్ని తినేవారన్న విషయం పండితులకు తెలుసని’ ఆమె అన్నారు.ఇందుకు ప్రమాణముగా రుగ్వేదం, బ్రాహ్మణాల నుంచే కాకుండా వేదాంతి యాజ్ఞ్యవల్క్యుడు, సామాజిక శాస్త్రవేత్త ఎమ్ ఎన్ శ్రీనివాస్ల నుంచి కూడా అనేక ఉటంకింపులను ఆమె ఉదహరించారు.
ఇట్లా ఇవి అన్నిఈ సమయం లో ఎందుకు మాట్లాడుతున్నారంటే ఆర్.ఎస్. ఎస్ , బీజేపీ, విశ్వహిందుపరిషత్ చెప్పే హిందుత్వం ఇతర మతాలపై దాడులు చేయిస్తున్నది , గో హత్యను వ్యతిరేకిస్తున్నది గోవులను చంపేవారిపై దాడులు చేయిస్తున్నది , ప్రతి ఒక్కరూ నా బంధువే అనటం లేదు, హిందూ లౌకిక వ్యవహారాలు అన్నిటా బహుళత్వం విలసిల్లుతున్నది, ఆ బహుళత్వం కువాళ్లంతా వ్యతిరేకం కాబట్టి నాకు హిందుత్వం అవసరం లేదు అని చెప్పటం. ,
గడిచిన కొద్దీ సంవత్సరాలుగా నేను హిందువునే కానీ ఆర్.ఎస్. ఎస్ చెప్పే హిందువును కాను అని చెప్పటం ప్రారంభించారు, ఇది చూస్తుంటే 1885 లో ప్రారంభమైన కాంగ్రెస్ 1907 సంవత్సరంలో సూరత్ లో జరిగిన సమావేశంలో తిలక్ మొదలైన ప్రఖర జాతీయ వాదులను అతివాదులు గా ముద్రవేసి తాము మితవాదులం అని చెప్పుకొంటూ విభేదాలు సృష్టించి జాతీయ వాదులను నెట్టివేశారు ఆ తదుపరి ఏమిజరిగిందో మనకు తెలుసు అదే విధంగాఆర్.ఎస్. ఎస్ , బీజేపీ, విశ్వహిందుపరిషత్ మొదలైనవారు అతివాదులు అందుకే తామే నిజమైన హిందువులం అని చెప్పకోవాలి అని కాంగ్రెస్ వాదులు ప్రచారం ప్రారంభించారు. డిస్మంట్లింగ్ గ్లోబల్ హిందుత్వ సెమినార్, శశిథరూర్ వ్రాసిన పుస్తకం, రెండు రోజుల క్రితం రాహుల్ మాట్లాడిన హిందువు వేరు హిందుత్వం వేరు, ఇప్పుడు చిదంబరం వ్రాసిన హిందూత్వ అవసరం నాకేంటి?అనే వ్యాసం ఇట్లా రాబోవు రోజులలో మరన్ని రావచ్చు. ఇవిఅన్నీ ఉత్తరప్రదేశ్ ఎన్నికలుదగ్గరలో ఉండటం , అధికారంకి దూరంగా ఉండటం తట్టుకోలేక మేము కూడా హిందువులమే అందులో మితవాద హిందువులం అని చెప్పుకొంటున్నారు. మొత్తం మీద చిదంబరం బహుశా మొదటిసారి హిందూధర్మం ప్రాచీనత, వైశిష్ట్యం వివరించారు. ఇట్లాంటి సత్యాలను అవసరార్ధం కాంగ్రెస్ వాళ్ళు మరన్ని రాబోవు రోజుల్లలో చెప్పబోతున్నారని అనిపిస్తున్నది , ఇది ఒకందుకు మంచిదే .ఇట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ హిందూ తీవ్రవాదాన్ని తేరా పైకి తెస్తారా ? అనేదిపెద్ద ప్రశ్న ఎందుకంటేవాళ్ళ ఇప్పటి ఎత్తుగడ పేలక పొతే పెరిగేది అసహనం దాని పరిణామం హిందూ తీవ్రవాద ము కావచ్చు ……. వేచి చూద్దాము.