“మేక్ ఇన్ ఇండియా’ లో భాగంగా హైదరాబాద్కు చెందిన HC రోబోటిక్స్ సంస్థ దేశంలోని భద్రతా దళాల కోసం నిఘా పరికరాలను రూపొందిస్తోంది.
అమెరికా, యూరోప్లోని పరిశోధనా కేంద్రాల సహకారంతో…మానవరహిత వైమానిక వాహనాలు (UAVలు), EOIR కెమెరాలు సహా AI-ఆధారిత ఇమేజ్ ప్రాసెసింగ్ సొల్యూషన్లలో ప్రత్యేకతను కలిగి ఉందీసంస్థ. డ్రోన్లు, కెమెరాలు, టాక్ టవర్లను తయారు చేస్తాము. నిఘా ప్రయోజనాల కోసం భారత సరిహద్దు దళాలకు సరఫరా చేస్తామని సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ డాక్టర్ దిలీప్ తెలిపారు. తక్కువ సమయంలో బేస్ క్యాంప్ కు లైవ్ ఫీడ్ అందించేసామర్థ్యంలో వీటిని డిజైన్ చేసినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఎలాంటి అడ్డంకులైనా ఎదుర్కొంటూ విమానాలకు రక్షణ కల్పించేలా రూపొందించారు. ఈ డ్రోన్లు వైమానిక నిఘా, మిలిటరీ ఇంటెలిజెన్స్ను సేకరించడంతో పాటు…సెర్చ్ & రెస్క్యూ (ఎస్ఏఆర్) కార్యకలాపాలకు ఉపయోగపడనున్నాయి. కోవిడ్-19 మొదటి వేవ్ సమయంలో డ్రోన్ సేవలకు గాను హెచ్సి రోబోటిక్స్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ నుండి ‘గుడ్ సమారిటన్’ అవార్డును అందుకుంది. గింబల్ ను కలిగిన 4K రిజల్యూషన్ కెమెరాలూ ఇక్కడి ప్రత్యేకం. సంస్థ మరొక ఉత్పత్తి టాక్ టవర్.. ఇది 40 అడుగుల పొడవైన కార్బన్ ఫైబర్ ట్యూబ్, ఇది భూమిపై నుంచి 40 అడుగుల ఎత్తులో 5 కి.మీ వ్యాసార్థం వరకు నిఘా ఉంచుతుంది.
UAVలు, గైరో స్టెబిలైజ్డ్ గింబల్ కెమెరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా ఇతర అధునాతన సాంకేతికతలపై పరిశోధన సహకారం కోసం IIT హైదరాబాద్, IIIT-DM కర్నూలు వంటి సంస్థలతో భాగస్వామ్యమైందీ కంపెనీ.