
File Photo
హైదరాబాద్ మరోసారి ఉగ్ర కలకలం రేగింది. దేశంలో ఎక్కడ ఉగ్ర దాడులు జరిగినా దాని మూలాలు, లింకులు హైదరాబాద్ లో బయటపడుతూనే ఉంటాయి. కేంద్రలో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రప్రథమంగా ఇంటలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేశారు. ముందస్తు సమాచారం సేకరించి ఉగ్రదాడులను భగ్నం చేస్తూ, విధ్వంసాలను, ప్రాణ నష్టాన్ని నివారించగలుగుతున్నారు. తాజాగా ఇంటెలిజెన్స్ అప్రమత్తతతో ఐసిస్ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుడిని అరెస్ట్ చేశారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ పేరుతో సోషల్ మీడియా ద్వారా యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్న ఐఎస్ఐఎస్ సానుభూతిపరుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పాతబస్తీలోని ఫలక్నుమాకు చెందిన మహ్మద్ అబుసాని గత కొన్ని నెలలుగా హైదరాబాద్లో రిక్రూట్మెంట్ కోసం సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతను ఐసిస్ కు మద్దతుగా, ఐసిస్ భావజాలాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడు. అతను గతంలో కూడా చాలాసార్లు ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఐపీ అడ్రస్ ఆధారంగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. దేశంలో ఐసిస్ కదలికల్ని నాలుగు రోజుల క్రితం భద్రతా బలగాలు గుర్తించాయి. టెలిగ్రామ్, ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఐసిస్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. అమెరికాకు వ్యతిరేకంగా ఐసిస్ తరపున యుద్ధం చేయాలంటూ కామెంట్స్ పెడుతున్నాడు. ప్రస్తుతం దేశంలో మూడు ఐసిస్ మాడ్యూల్స్ యాక్టివ్ గా ఉన్నాయని భద్రతా సంస్థలు వెల్లడించాయి. ఈ పరిణామాల దృష్టా ఇంటలిజెన్స్ వ్యవస్థ మరింత అప్రమత్తతగా ఉంది.