హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. మొత్తం ఏడు రౌండ్లలో ఈ లెక్కింపు కొనసాగింది. టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి తొలి ప్రాధాన్యతలో ఆధిక్యంలో ఉండగా.. రెండో స్థానంలో బీజేపీ అభ్యర్ధి రామచందర్రావు ఉన్నారు. ఏడు రౌండ్లలో కలిపి టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి 1,12,689 ఓట్లు పోలవ్వగా.. బీజేపీ అభ్యర్థి రామచందర్రావుకు 1,04,668 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్రావుకు 53,610 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 31,554 ఓట్లు, టీడీపీ అభ్యర్థి ఎల్ రమణకు 5,973 ఓట్లు పోలయ్యాయి. కాగా, ఏడు రౌండ్లలో 21,309 ఓట్లు చెల్లబాటు కానివి ఉన్నాయి. ప్రస్తుతం తొలి ప్రాధాన్యం
ఓట్లలో ఎవరికీ మెజారిటీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతున్నారు.