కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారి గురుంచి తెలిసీ తప్పు చేయడం అంటే అది ఖచ్చితంగా అవివేకమే. భార్యాభర్తలు అయిన ఇద్దరు IAS అధికారులు సంజీవ్ ఖర్వార్ అతని భార్య రిన్కూ ఘగ్గాలు ఢిల్లీ లోని త్యాగరాజ్ స్టేడియంలో వాకింగ్ కోసం తమ పెంపుడు కుక్కతో సహా వచ్చారు. వచ్చీ రాగానే ఆ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న అధ్లెట్లని వెంటనే అక్కడ నుంచి వెళ్లిపొమ్మని ఆదేశించారు. స్టేడియం అధికారులు విధి లేక సదరు భార్యాభర్తలు అయిన ఐఏఎస్ అధికారుల ఆదేశాలని అమలు చేస్తూ అక్కడ సాధన చేస్తున్న క్రీడాకారులని పంపించి వేశారు. విషయం హోం మంత్రి అమిత్ షా గారి చెవిన పడింది. వెంటనే సంజీవ్ ఖిర్వార్ ని లడక్ కి ట్రాన్స్ఫర్ చేశారు, ఇక సంజీవ్ భార్య రిన్కూ ఘగ్గా ని అరుణాచల్ ప్రదేశ్ కి బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. తాము పనిచేస్తున్నది పాత ప్రభుత్వo లో అని భ్రమలో ఉన్నట్లున్నారు. VVIP సంస్కృతిని ఏ మాత్రం సహించని బిజేపి ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతిని మరిచిపోయారు.
దీని మీద ఢిల్లీ నెటిజన్లు ఆనందం వ్యక్తం చేశారు. క్రీడా స్టేడియంలు ఉన్నవి క్రీడాకారులకి మాత్రమే అని అలా కాకుండా VIP లమని ఫోజులు కొడుతూ ఇలా వ్యవహరించే వారిని ఏ మాత్రం ఉపేక్షించే ప్రసక్తే ఉండకూడదు అంటూ అమిత్ షా ట్విట్టర్ లో అభినందనలతో ముంచెత్తారు.
~ పార్ధసారధి పోట్లూరి