వంద మంది పాకిస్తాన్ సైనికులను హతమార్చినట్టు బలూచిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. పాకిస్థాన్ మిలిటరీ క్యాంపుల్లోకి వెళ్లి మరీ వారిని చంపామంది. ప్రస్తుతం పాకిస్థాన్లోని పంజ్గుర్, నుష్కీ మిలిటరీ క్యాంపులు ప్రస్తుతం తమ నియంత్రణలో ఉన్నట్టు తెలిపింది.అయితే పాకిస్తాన్ ప్రభుత్వం వాస్తవాలను తొక్కిపెడుతోందని ఇద్దరు సైనికులు మాత్రమే చనిపోయారని నమ్మబలుకుతోందని ఆర్మీ ఆరోపించింది. వాస్తవాలు వెలుగుచూడకుండా ఉండేందుకు పాక్ తన మీడియాను నిషేధించడంతో పాటు కమ్యూనికేషన్ వ్యవస్థను నిలిపేసిందని మండిపడింది.
అయితే బలూచ్ ప్రకటనను ఖండించిన పాక్ ఆర్మీ… మిలిటరీ శిబిరాలపై దాడి నిజమేనని మాత్రం అంగీకరించింది. ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయని… నలుగురు ఉగ్రవాదులు కూడా హతమయ్యారని పేర్కొంది.
3 جنوری2022
پنجگوراورنوشکی میں سکیورٹی فورسزکے کیمپوں پردہشت گردحملوں
پر اہم پیغام جاری.@OfficialDGISPR @GovtofPakistan @PTVNewsOfficial pic.twitter.com/q4wcxuw6XT— Sheikh Rashid Ahmed (@ShkhRasheed) February 3, 2022