తెలంగాణలో మూకుమ్మడి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి బాల వికాస్ సోషల్ సర్వీస్ సొసైటీ, బాల థెరిస్సా సొసైటీల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సొసైటీ ఫౌండర్ సింగిరెడ్డి శౌరెడ్డికి చెందిన ఆస్తులపై ఐటీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. సొసైటీ పేరిట…విదేశాల నుంచి వచ్చిన రూ.412 కోట్ల నిధులు రాబట్టినట్టు సమాచారం రావడంతో ఆదాయపన్నుశాఖ ఈ దాడులు చేస్తోంది. శౌరిరెడ్డి విదేశీ నిధులతో భార్యపేరిట పెద్దెత్తున ఆస్తులు కొన్నట్టు… సొసైటీలోని పలువురు ఉద్యోగుల పేర్లపైనా ఆస్తులను కొనుగోలు చేసినట్టు గుర్తించారు.. వరంగల్, హైదరాబాద్తో కలిపి మొత్తం 40 చోట్ల ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు..