కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్..!
https://twitter.com/ANI/status/1361537799397150720
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు క్షీణించిపోతుంది. ఇప్పటికే అనేక రాష్ట్రాలను కోల్పోయిన హస్తం పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పుదుచ్చేరిలో ముసలం మొదలైంది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వరుసగా రాజీనామా బాటపడుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే ఏ.జాన్ కుమార్ కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పారు. రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ వీపీ శివకొలుందతుకు సమర్పించారు. జాన్ కుమార్ ఇప్పటికే బీజేపీ ఇంచార్జి నిర్మల్ కుమార్తో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో చేరే అంశంపై చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. బీజేపీకి చెందిన పలువురు సీనియర్ నేతలను ఢిల్లీలో కలుసుకున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక రేపో మాపో జాన్ కుమార్ కమలం గూటికి చేరుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు కూడా తన పదవులతో పాటు కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పారు.
ఇదిలావుంటే.. ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ మైనార్టీలో పడిపోయింది. వరుసగా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తుండటంతో.. ప్రస్తుతం కాంగ్రెస్ బలం 14కి చేరింది. అసెంబ్లీలో మొత్తం 30 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. కాంగ్రెస్ పార్టీకి 14 మంది బలమే ఉండటంతో మైనార్టీలోకి పడిపోయింది. వీరిలో ముగ్గురు డీఎంకే ఎమ్మెల్యేలు ఉండగా.. ఒకరు స్వతంత్ర అభ్యర్ధి ఉన్నారు.