భోథ్ మండలం ధన్నూర్ (బి) గ్రామంలో బలరాం జాదవ్ ఏర్పాటు చేసిన వైద్యశిబిరానికి మంచి స్పందన వచ్చింది. మండలం చుట్టుపక్కల గ్రామాల నుండి వందల సంఖ్యలో ప్రజలు వచ్చి వైద్యులకు చూపించుకొని వైద్యపరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో మందుల పంపిణి కూడా చేసారు. గ్రామపెద్దలు యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమవంతుగా సహాయ సహకారాలు అందించారు. బలరాం ఏర్పాటు చేసిన ఈ శిబిరం భోథ్ మండలవాసులకు ఊరటనిచ్చిందని,చాలామంది దూరప్రాంతాలకు వెళ్ళలేని వారు, వైద్య ఖర్చులకు డబ్బులు లేని వారు ఈ సదావకాశాన్ని ఉపయేగించుకున్నారని అన్నారు. బలరాం నిస్వార్ధ సేవకు సలాం అన్నారు. సమాజంలో అందరి గురించి ఆలోచించే బలరాం సేవలు అమేఘం అని ఎన్నో సేవాకార్యక్రమాలు చేసి అందరి మన్ననలు పొందుతున్నాడని అన్నారు. ధన్నూర్ గ్రామ ప్రజలు అతనికి ధన్యవాదాలు తెలిపారు. బలరాం మాట్లాడుతు మొన్నటి వరకు కురిసిన వర్షాలకు గ్రామ ప్రజలు చాలా మంది అనారోగ్యంపాలయ్యారని వారిని చూసి నా మనసు చలించిపోయిందని అన్నారు. దాని కారణంగానే ఇక్కడ ఎలాగైనా వైద్యశిబిరం పెట్టించాలని ప్రతినబూనానని అన్నారు. మనం ఆరోగ్యంగా ఉంటేనే అన్ని రకాలుగా బాగుంటామని ప్రజల సంక్షేమమే దేశసంక్షేమమని అన్నారు. ఈ శిబిరం విజయవంతంకావడానికి సహకారం అందించిన గ్రామ పెద్దలకు, యువకులకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా సంఘ్ చాలక్ ప్రతాప్ రెడ్డి గారు,సర్పంచ్ గంగాధర్,VDC చైర్మన్ చిన్న గంగా రెడ్డి,అశోక్ రెడ్డి,నర్సయ్య,ప్రధానోపాధ్యాయులు పోశెట్టి,కృష్ణ,ప్రవీణ్,శ్రీకర్, డానియల్,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.