ఎల్పీజీ వినియోగదారులకు శుభవార్త. గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింది. మూడు నెలలకు పైగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా స్థిరంగా ఉండడంతో..దేశీయ చమురు కంపెనీలు వాణిజ్య సిలిండర్ ధరను తగ్గించాయి.19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రేటును భారీగా 91 రూపాయలు తగ్గించారు.
ఈ తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య సిలిండర్కు రూ.1885 చెల్లించాలి. గతంలో దీని ధర రూ.1976.50గా ఉండేది. కోల్కతాలో 2095.50 నుంచి 1995.50కి దిగొచ్చింది, ముంబైలో 1936.50కి నుంచి రూ.1844 పడిపోయింది. చెన్నైలో 2141 ఉండగా… రూ.2045 కు తగ్గింది. ఇక హైదరాబాద్లో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ రూ.2099.5కి రానుంది. 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ల విషయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలు స్థిరంగా ఉన్నాయి.
https://twitter.com/ANI/status/1565188924825571328?s=20&t=zPqdPeeqbE9ud75UblwZbQ