తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో భారీ మార్పులు జరిగాయి సుమారు 45 కు పైగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. వీరిలో చాలామంది ముఖ్య కార్యదర్శి కమిషనర్ స్థాయి పదవుల్లో ఉన్నవారే కావడం విశేషం. ఒక రకంగా చెప్పాలి అంటే ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలోనూ కీలక పదవుల్లో మార్పులు చేస్తూ వచ్చారు
వాస్తవానికి పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన చేస్తూ వచ్చింది దీంతో కెసిఆర్ కుటుంబ సభ్యులకు సన్నిహితంగా ఉండే అధికారులు వివిధ స్థానాల్లో పాతుకుపోయి పనిచేస్తూ వచ్చారు.. కుటుంబ పాలన జరిగింది అంటూ ఇంటా బయట కూడా విమర్శలు హోరెత్తాయి. ఇప్పటికీ అది అధికారులు కొనసాగుతూ ఉండటంతో గులాబీ నాయకుల హవా అలాగే ఉంది అన్న మాట వినిపిస్తోంది.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత వివిధ మార్గాలను సీఎం రేవంత్ రెడ్డి ఫీడ్బ్యాక్ తెప్పించుకున్నారు. ముఖ్యంగా పార్టీ శ్రేణులు కాంగ్రెస్ నాయకుల నుంచి ప్రముఖ దినపత్రికల జర్నలిస్టుల నుంచి ఆయన సమాచారం తీసుకున్నారు. ఈ సమాచారం ఆధారంగా వివిధ శాఖలకు నాయకత్వం వహిస్తున్న ఐఏఎస్ అధికారుల్ని సమగ్రంగా మార్చేశారు.
టిఆర్ఎస్ పరిపాలనలో అజమాయిషీ చలాయించిన అధికారులను చాలావరకు లూప్ లైన్ కు పంపించారు. అదే సమయంలో సీనియారిటీ సమర్ధత కలిగిన అధికారులను మాత్రం కొనసాగిస్తున్నారు ఉదాహరణకి ప్రభుత్వానికి నాయకత్వం వహించే ప్రధాన కార్యదర్శి పదవిలో ఇప్పటికీ శాంతి కుమారి నే కొనసాగిస్తున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం లో నియామకం పొందినప్పటికీ కాంగ్రెస్ సర్కార్లో కూడా ఆమె ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నారు. అలాగే అప్పట్లో వరంగల్ కలెక్టర్గా సీఎం పేసి అధికారిగా పేరు తెచ్చుకున్న ఆమ్రపాలికి కీలక పదవి దక్కింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ గా పోస్టింగ్ ఇచ్చారు. మంత్రి శ్రీధర్ బాబు సతీమణి శైలజ రామయ్యరకు చాలా కాలం తర్వాత కీలక పోస్టింగు దక్కింది దేవాదాయ ధర్మాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆమెను నియమించారు. గ్రేటర్ హైదరాబాద్ అవినీతి పేరుకుపోయింది అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథను నియమించారు. నిబంధనలు కచ్చితంగా పాటిస్తారు అని పేరు తెచ్చుకున్న సీనియర్ అధికారి వాణిదేవిని టూరిజం క్రీడలు శాఖ కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు సీనియర్ అధికారి సందీప్ కు అతి కీలకమైన ఆర్థిక శాఖ పగ్గాలు అప్పగించారు.
మొత్తంగా 44 శాఖల అధిపతుల నియామకాల్లో మార్పులు జరిగాయి. రేవంత్ రెడ్డి దూకుడు కి తగినట్లుగా పనిచేసే వారికి కీలక పదవులు ఇచ్చినట్లుగా గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.