పాకిస్తాన్లో హిందువుల జనాభా గణనీయంగా పడిపోతోంది. ప్రస్తుత లెక్కల ప్రకారం పొరుగుదేశంలో ఉన్నహిందువుల సంఖ్య 22 లక్షలు. నేషనల్ డేటాబేస్ నివేదిక ప్రకారం 18,68,90,601 జనాభాలో కేవలం 1.18 శాతం మాత్రమే హిందువులు ఉన్నారు.నేషనల్ డేటాబేస్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ సేకరించిన డేటా ఆధారంగా పాకిస్థాన్ దేశ మొత్తం జనాభాలో మైనారిటీలు ఐదు శాతం కంటే తక్కువగా ఉన్నారు. అందులో హిందువులు అతిపెద్ద మైనారిటీ కమ్యూనిటీ. తాజా డేటా ప్రకారం దేశంలో మొత్తం 18,68,90,601 జనాభాలో 18,25,92,000 మంది ముస్లింలు.కంప్యూటరైజ్డ్ నేషనల్ ఐడెంటిటీ కార్డ్స్ పొందిన మైనారిటీల డేటాలో 1,400 మంది నాస్తికులు కూడా ఉన్నారు.
పాక్ దేశంలో నమోదిత హిందువులు 22,10,566 మంది, క్రైస్తవులు 18,73,348మంది, సిక్కులు 74,130మంది, భాయిలు 14,537,3,917 మంది పార్సీలున్నారని నివేదిక పేర్కొంది. బౌద్ధులు 1,787 మంది, చైనీస్ దేశీయులు 1,151మంది, షింటోయిజం అనుచరులు 628, యూదులు 628మంది, ఆఫ్రికన్ మతాల అనుచరులు 1,418 మంది, కెలాషా మతస్థులు 1,522మంది, జైనమతానికి చెందిన వారు ఆరుగురు ఉన్నారు.