తెలుగు రాష్ట్రాలకు భారీగా కేంద్ర నిధులు
……..
తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం మరోసారి అభిమానం చాటుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి పర్యటన సందర్భంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వేలకోట్ల రూపాయలతో చేపట్టిన ఈ అభివృద్ధి పనులతో రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతో మేలు కలుగుతుంది.
…..
మొత్తం 57,962 కోట్లు విలువ గల 94 అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు చేసి జాతికి అంకితం ఇచ్చారు. రాజధానిలో కొత్తగా అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలు, న్యాయమూర్తుల నివాస సముదాయ భవనాల నిర్మాణం చేపట్టనున్నారు. విశాఖలో పీఎం ఏక్తా మాల్ను ప్రధాని ప్రారంభోత్సవం చేశారు.
………..
10 నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన కేటాయింపులు ఇలా ఉన్నాయి.రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ.15,000 కోట్లు
హడ్కో ద్వారా అదనంగా మరో రూ.11,000 కోట్లు
పోలవరం ప్రాజెక్టుకు కొత్తగా రూ.12,157 కోట్లు
పేదలకు అందించే టిడ్కో గృహాల నిర్మాణానికి రూ. 4,400 కోట్లు
రాష్ట్రంలో రైల్వే రంగ అభివృద్ధి కోసం రూ. 73,743 కోట్లు
తిరుపతి జిల్లా కృష్ణపట్నంలో రూ. 2139 కోట్లతో క్రిస్ సిటీ
అనకాపల్లి జిల్లా పూడిమడకలో రూ. 18,500 కోట్లతో హైడ్రోజన్ కేంద్రం
అమరావతికి రూ. 2,245 కోట్లతో నూతన రైల్వే లైన్ మంజూరు
స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కొరకు రూ. 11, 440 కోట్లు
విశాఖ జిల్లా నక్కపల్లిలో రూ.1,877కోట్లతో బల్క్ డ్రగ్ పార్క్
మొత్తం 13 రాష్ట్ర రహదారుల అభివృద్ధికి రూ. 400 కోట్లు
రణస్థలం కారిడార్ అభివృద్ధికి రూ. 252.42 కోట్లు
గుంటూరు – నల్లపాడు ఆర్ఓబి నిర్మాణానికి రూ. 198 కోట్లు
పెట్రోలియం యూనివర్శిటీ ఏర్పాటు కోసం రూ.168 కోట్లు
….
కేటాయించారు.
………
ఈ అభివృద్ధి పనులతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు సౌకర్యాలు మెరుగవుతాయి. పరిశ్రమలు తరలి రావడం ద్వారా అభివృద్ధి సాకారం అవుతుంది.
పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు కలుగుతాయి. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని మరోసారి రుజువు అయింది.