పత్తి ధరలు కనీస మద్దతు ధరల స్థాయికి చేరినందున, పత్తి రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పత్తి ధర విషయంలో మద్దతు కోసం భారతీయ పత్తి కమిషన్ కు (సి.సి.ఐ.కి) రూ. 17,408.85 కోట్లు అందించే ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
పత్తిపంట సాగుతో దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాలు, 58లక్షల మంది పత్తి రైతులకు ప్రయోజనం చేకూరనుంది.
దాదాపు 4 కోట్లమంది
పత్తి సంబంధిత ప్రాసెసింగ్ కార్యకలాపాల్లోను, పత్తి వాణిజ్యంలోనూ ఉపాధి పొందుతున్నారు.అందుకే 2014-15 నుంచి 2020-21 ఏడాదికి వర్తింపజేస్తూ నిర్ణయంతీసుకుంది కేంద్ర ప్రభుత్వం…