
ఏదైనా సమస్య వచ్చినా, వెంటనే దానివల్ల ఆ సంస్ధలకు, వాటిల్లో డబ్బులు దాచుకున్న వారికి, పెట్టుబడి పెట్టిన వారికి ఎక్కువ నష్టం జరగకుండా ప్రభుత్వం, ప్రతిపక్షాలు, మీడియా ప్రయత్నించాలి.
ముఖ్యంగా మీడియా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ఎందుకంటే, ఇటువంటి సంక్షోభ సమయాల్లో రూమర్లు ఖాతాదారుల్లో మరింత భయాన్ని సృస్తిస్థాయి. ఈ భయంతో ఆ సంస్థల నిధులపై మరింత వత్తిడి పెరిగి, ఆ సంస్థలు మరింత త్వరితంగా పతనం వైపు వెళ్తాయి. ఈ వత్తిడి వల్ల ఆ సంస్థలకే కాదు ఆ సంస్థలలో డబ్బులు దాచుకున్న డిపాజిటర్లు కు మరియు పెట్టుబడి పెట్టిన వారికి అనుకున్న దాని కన్న భారీ నష్టం కలుగుతుంది.
ఎందుకంటే, ఏ సంస్థలకు అయినా అంటే ఎంత పెద్ద బ్యాంకులు లేదా ఇన్సూరెన్స్ లేదా వ్యాపార దిగ్గజాలు
అయినా డబ్బులు రొటేషన్ జరుగుతున్నంత కాలం
వ్యాపారం సజావుగా సాగిపోతుంది. ఇలా వ్యాపారం సాగడానికి ముఖ్యంగా తక్షణ అవసరాల కోసం నిధుల
లభ్యత ఉండాలి. దీనినే ఆర్ధిక పరిభాషలో “లిక్విడిటీ”
అంటారు.
ఏదో విధంగా ఒక సంష్టకు లిక్విడిటీ సమస్య ఏర్పడితే,
అంటే ఏదో రూమర్ వల్లో మరేదో కారణం వల్లో డబ్బులు దాచుకున్న వారు ఒకే సారి సంస్థ నుండి మా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చేయండి అంటే, ఏ సంస్థ కూడా వెంటనే ఇవ్వలేదు. ముందుగా వచ్చిన కొద్ది మందికి వెంటనే సర్దుబాటు చేయగలదు. ఆ తరువాత వచ్చిన వారికి కాస్త సమయం ఇవ్వండి మీ డబ్బులు వెనక్కి ఇస్తాం అని చెప్తారు. “వెంటనే ఇవ్వలేం” అనే ఈ ఒక్క వాక్యం చాలు ఆ సంస్థ పై అపనమ్మకం ఏర్పడి మరింత మంది తమ సొమ్ములు వెనక్కి ఇవ్వమని వత్తిడి చేయడం, ఆ వత్తిడి రోజు రోజుకూ పెరగడం, దాంతో సంస్థ చేతులు ఎత్తెయ్యడం జరుగుతుంది.
అందుకే మీడియా, ప్రతిపక్షాలు నోటికి వచ్చింది రాయకుండా, వాగకుండా , ప్రజలను భయభ్రాంతులకు గురిచేయకుండా ప్రవర్తించాలి.
ఆ దేశాల్లో మీడియా ఎంత బాధ్యతగా ప్రవర్తిస్తోందో చూడండి.
మొదటి ఒకటి రెండు రోజులు బ్యాంకులు దివాలా వార్తల మీద ఎక్కువగా నెగటివ్ వార్తలు రాసిన మీడియా, మూడో రోజు నుండి వాటికి ప్రాధాన్యత తగ్గించి, ప్రజలకు నష్టం కలగకుండా ఉండటానికి ఆ బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు తీసుకుంటున్న దిద్దుబాటు చర్యలపై ఎక్కువ ఫోకస్ చేస్తూ ప్రజల్లో భయం తగ్గిస్తూ , నమ్మకం పెరిగే వాతావరణం సృస్థిస్తున్నారు.
మరి మన దేశంలో…..
…..చాడా శాస్త్రి……