భారత్ పాకిస్తాన్ రెండు దేశాలు తమ ప్రయాణాన్నిఒకే సమయం లో ఒకే పరిస్థితి లో ప్రారంభించాయి . అనాటి దేశ పరిస్థితులు సామాజిక, ఆర్థిక, రాజకీయ, మత, సాంస్కృతిక పరిస్థితులు అంతర్జాతీయ పరిణామాలు వీటి అన్నిటి మధ్య ఆ ప్రయాణం మొదలైంది.75 సంవత్సరాలు గడిచిపోయాయి ఆ ప్రయాణంలో రెండు దేశాలు ఎట్లా ఉన్నాయో ఒకసారి గమనిద్దాం .
1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం.యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంటు1947 జూలై 18న భారత స్వాతంత్ర్య చట్టం, (జూలై 18, 1947) ఆమోదించ బడింది, ఆ చట్టం ప్రకారం “భారతదేశం”గా నిర్వచించబడిన దక్షిణాసియా భూభాగాల్లోని స్వతంత్ర భారతదేశం మరియు పాకిస్తాన్ల ఏర్పాటు నిర్ణయించబడింది, దాంతో భారతదేశం ముక్కలైంది, దాని పరిణామంగా ప్రపంచ పటంలోమొట్టమొదటి మతం ప్రతిపాదికన ” ఇస్లామిక్ రిపబ్లిక్” పేరుతో 1947 ఆగస్టు 14న పాకిస్తాన్ అనే దేశం ఏర్పడింది,1947 ఆగస్టు 15న భారతదేశం స్వతంత్రం పొందింది, .పాకిస్తాన్ ఎటువంటి దాపరికాలు లేకుండా ఇస్లాం మతరాజ్యం గ ప్రకటించుకొంటే భారత్ హిందూ రాష్ట్రము గా ప్రకటించుకో లేక పోయినా కనీసం భారత్ గా కూడా ప్రకటించుకోలేక ఇండియా అని ప్రకటించు కొంది ,రాజ్యాగాన్ని తయారు చేసుకొనే సమయంలో అనేక మంది పెద్దలు, ప్రజల వత్తిడి కారణంగా దానిని కొద్దిగామార్చి india that is bharat గ ఈ దేశాన్ని పేర్కొంది, అది ఆనాటి మన నాయకుల మనస్థితి. ఈ 75 సంవత్సరాలలో ఏమైనా మార్పు వచ్చి ఈ దేశాన్ని భారత్ గా ప్రకటించుకొందా? అంటే లేదు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు సృష్టించిన అపోహల నుండి బయటపడలేకపోవటం , ఈ 75 సంవత్సరాలలో ఆ అపోహల నుండి బయటపడి మనగురించి మనం స్పష్టం గా చెప్పుకోలేక పోతున్నాము, ఇది ఒక పెద్ద ప్రశ్న దీనికి సమాధానం ఎప్పుడు దొరుకుతుందో ?. ఈ రోజున ఈ దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు మూలం బ్రిటిష్ వాళ్ళు సృష్టించిన అపోహలే కారణం దానిపై కనీసం సమీక్షా జరుపుకొనేందుకు కూడా దేశం సిద్ధం గా లేదు అది మన మన: స్థితి, అంతే కాదు లేని విషయాలను తలకెత్తుకొని మనకు మనమే కొట్లాడుకోవటం కూడా జరిగిపోతున్నది ఉదాహరణకు భారతదేశ సహజ స్వభావం సర్వపంథ సమ భావన , అందుకే రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలో సెక్యులర్ పదంచేర్చవలసిన అవసరం లేదు అనుకొన్నారు , కానీ కాలక్రమంలో 1975వ సంవత్సరం ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితి సమయంలో భారత రాజ్యాంగ సవరణ చేసి సెక్యులరిజం, సోషలిజం అనే రెండు పదాలను చేర్చారు, అప్పటి నుండి 1992 వరకు సెక్కులరిజం పైన ఎంత రభస జరిగిందో ఒకసారి వెనక్కి వెళ్తే అర్ధమౌతుంది దానితో మనం ఎంత గొప్పవారేమో మనకు అర్ధమౌతుంది, ఇది మనకు ఏమి అర్ధం చేయిస్తున్నదంటే తమనుతాము ప్రశ్నర్ధకం చేసుకోవటం లో బహుశా మనలను మించినవాళ్లుఈ ప్రపంచం లో ఎవరు ఉండరు అని, ఇది ఏమి అతిశయోక్తి కాదు..
75 సంవత్సరాలలో పాకిస్తాన్ అమెరికా చైనా ల ఉపగ్రహం గా మారినతీరు
పాకిస్థాన్ పుట్టికే భారతదేశం పై విద్వేషం, అది లేకపోతే పాకిస్తాన్ ఏర్పడేదే కాదు, ఆ విద్వేషం బలంగా ఉండేందుకు పాకిస్తాన్ నాయకులు వ్యూహరచన చేసుకుంటూ వచ్చారు, దాంతో పాకిస్తాన్ ఎటువంటి దేశంగా మారిపోయింది అంటే మనిషి రక్తం రుచి మరిగిన పులి ఎట్లా నరమాంసభక్షణ వేటిలో పడుతుందో పాకిస్థాన్ కూడా నరసంహార రుచి మరిగి విధ్వంసం రచన చేసుకొని ప్రయాణం చేసుకుంటూ తనకుతాను పతనం అంచుకు వేగంగా చేరుకొంటోంది. పాకిస్తాన్ లో 1948 సెప్టెంబర్ 11వ తేదీన మహమ్మద్ అలీ జిన్నా మరణించిన తర్వాత అధికారం లియాఖత్ అలీ ఖాన్ చేతిలోకి వెళ్ళిపోయింది, బలహీన నాయకత్వం సైనిక తిరుగుబాటు లకు తెరలేపింది దానితో పాకిస్తాన్ పూర్తిగా ఇస్లాం నియంత్రణులోకి వెళ్లిపోయింది .అయూబ్ ఖాన్ సైనిక తిరుగుబాటు చేశాడు. కాశ్మీర్ ఆక్రమించుకోవాలి అనే లక్ష్యం తో పాకిస్తాన్ క్రమంగా సైన్యాధికారుల నియంత్రణలోకి వెళ్ళిపోయింది 1948 లో కాశ్మీర్ ఆక్రమణకు జరిగిన మినీ యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం వెనక్కి తిరిగి పారిపోవలసి వచ్చింది ఆ అవమానంతో భారత్ ను దెబ్బ కొట్టాలని 1965లో పూర్తిస్థాయి యుద్ధం చేసి ఘోర పరాజయం పాలైంది, ఒకరకంగా భారత్ ను విధ్వంసం చేయాలని లక్ష్యంతో తనను తాను విధ్వంసం చేసుకునే దిశలోపాకిస్తాన్ పడిపోయింది. దాని పతనం 1965 నుండి క్రమంగా ప్రారంభమైందని చెప్పవచ్చు, దాని పరిణామం పాకిస్తాన్ ఉగ్రవాద ఉత్పత్తి కేంద్రాల వైపు మళ్ళిపోయింది, ఎందుకంటే సైనిక శక్తితో భారత్ ను నియంత్రించడం అసాధ్యమని వాళ్లకు అర్థమైంది. ఏ ఉగ్రవాదాన్ని భారత్ కు వ్యతిరేకంగా నిర్మాణం చేయాలనుకుందో ఆ ఉగ్రవాద కోరల్లో పాకిస్తాన్ చిక్కుకుని పోయింది, దానితో ఆ దేశం భౌగోళికంగా ఒక కీలక స్థానంలో ఉన్నప్పటికీ ఆర్థికంగా శక్తివంతమై ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరచలేకపోగా భారత్ తో ఆయుధ పోటీలో అణ్వయుధాలు కూడా తయారు చేసుకుంది, ప్రపంచాన్ని బెదిరించాలని, భారత్ ను కట్టడి చేయాలని పగటి కలలు కంటూ ఉన్నది , పాకిస్తాన్ కు కలిసి వచ్చింది ఏమిటంటే దక్షిణాసియా పై పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్న అమెరికా చైనా దేశాలు పాకిస్తాన్ ప్రక్కకు చేరిపోయాయి , పాకిస్తాన్ ఆ దేశాలకు ఉపగ్రహ దేశంగా మారిపోయింది, అమెరికా చైనా రెండు దేశాలు పాకిస్తాన్ కు ఆర్థిక అండదండలు అందిస్తూనే పాకిస్తాన్ నాయకులను అంతరంగికంగా బందీచేశాయి , పాకిస్తాన్ సైనిక అభివృద్ధి పై పెట్టిన దృష్టి పారిశ్రామిక అభివృద్ధి పై పెట్టలేకపోయింది, మౌలిక సదుపాయాలను విస్తరణ విస్మరించింది, పాకిస్తాన్ తన సైనిక శక్తిని పెంచుకునేందుకు ఆఫ్గనిస్తాన్ పరిణామం కూడా కలిసి వచ్చాయి అదే ఆ దేశాన్ని సర్వనాశనం చేసే దిశలో మళ్లిస్తున్నదని అంచనా వేయలేకపోయింది, దానితో అమెరికా చైనా కు బందీ అయిపోయింది. అమెరికా చైనా రెండు కూడా పాకిస్తాన్ పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడలేదు అమెరికాకు ఆఫ్ఘనిస్తాన్ లక్ష్యం, అట్లాగే చైనాకు అరేబియా సముద్రంపై తన ఉనికిని కాపాడుకోవడం లక్ష్యం. అమెరికా చైనా రెండు దేశాలు తమ లక్ష్యసాధనకు పాకిస్తాన్ ను తమ చెప్పు చేతలలో ఉంచుకునే ప్రయత్నం సాగించాయి . ఈ రెండు కూడా పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ స్టేట్ గా తనంతట తాను నిలబడనీయకుండా అస్థిరపరుస్తూనే వస్తున్నాయి, పాకిస్తాన్ ఎటువంటి దయనీయ స్థితిలో చిక్కుకొని పోయిందంటే ప్రపంచంలో ఆర్ధికంగా రెండవ శక్తిగా ఎదిగిన చైనా మిత్ర దేశం అయినప్పటికీ తన సొంత ప్రజలకు కడుపు నింపక లేకపోతున్నది. పాకిస్తాన్ లో ఉగ్రవాద పరిశ్రమ మినహా మిగిలిన పరిశ్రమలన్నీ క్షీణ దశలో ఉన్నాయి. ద్రవ్యోల్బణం , నిరుద్యోగం, స్థబ్దత పెరిగిపోయి దేశం అప్పుల పాలైపోయింది. పాకిస్తాన్ అప్పులు 10. 886 బిలియన్ డాలర్లు, విదేశీ మారకద్రవ్య నిలువలు 2 బిలియన్ డాలర్లకు పడిపోయి కొట్టు మిట్టాడుతున్నది, ఈ మధ్యనే పాకిస్తాన్ చైనా నుండి 2.3 బిలియన్ డాలర్లు అప్పుగా తీసుకున్నది దాని వడ్డీ రేటు రహస్యమే, ఐ ఎం ఎఫ్ నుండి ఒక బిలియన్ డాలర్లు అప్పు పొందేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది, విదేశీ మారక ద్రవ్య నిలువలు కాపాడుకోవడానికి అక్కడి ప్రజలను చాయ్, లస్సి, మొదలైన దేశీయ ఉత్పత్తులను వాడుకోమని ప్రజలకు పిలుపునిస్తున్నది అది పాకిస్తాన్ యొక్క ఆర్థిక గందరగోళ స్థితి.
భారత్ అనేక ఆటంకాల మధ్య ప్రపంచ శక్తిగా ఎదుగుతున్న తీరు
భారత్ కు ఇస్లామిక్ పాకిస్తాన్ ఒకేవైపు, మరోపక్క బంగ్లాదేశ్, ఇంకొక ప్రక్క చైనా ల ఆక్రమణలు ఎత్తుగడలను ఎదుర్కొంటూ దానికి మూల్యాన్ని చెల్లించుకుంటూ , వాళ్లను కాచుకుంటూ వస్తున్నది, అంతర్గతం గా దేశంలో మరన్ని పాకిస్థాన్ లు నిర్మాణం చేసే ప్రయత్నం జరుగు తున్నాయి ఆ శక్తు లు నిర్మాణం చేసే దాడులు, మతం మార్పిడిలు ఆక్రమణలు, విధ్వంసరచనలు, ఎదుర్కొంటూనే దేశాభివృద్ధి, దేశంలో శాంతి పరిరక్షణ, ఆర్థిక, సైనిక, సామాజిక, శక్తిగా నిర్మాణం అవుతూ రాజకీయ స్థిరత్వం సాధించే దిశలో భారత్ వేగంగా ప్రయాణం చేస్తున్నది, ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన దేశంగా వేగంగా ఎదుగుతూ వస్తున్నది అభివృద్ధి వైపు వేగంగా ప్రయాణం చేస్తున్నది. , ప్రపంచంలోనే ఆరవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిర్మాణం అవుతున్నది, కరోనా సమయంలో ప్రపంచంలో అనేక దేశాలు ఆర్థిక మాంద్యంలో పడిపోతే ఆ సమయంలో భారత్ వార్షిక జిడిపి7నుంచి 8 శాతం వృద్ధిలో ఉన్నది. డాలర్ ఒడిదుడుకుల మధ్య ఉగిసలాడుతూఉంటే భారత్ 572 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిలువలతో నిలదొక్కుకొంటూ వచ్చింది. వ్యాపారం, ప్రజల జీవనం రెండు కూడా సరళీకరణ దిశగా సాగిపోతున్నది. ప్రపంచంలో మూడవ అతిపెద్ద యూనికార్న వ్యవస్థను నిర్మాణం చేసుకున్నది, దాని విలువ 332.7 బిలియన్ డాలర్లు. అపారమైన ప్రకృతి వనరుల తో రాష్ట్రాలు కూడా అభివృద్ధి దిశలో ఉన్నాయి, సామాజిక అసమానతలను, పేదరికాన్ని గణనీయంగా తగ్గించుకుంటూ దేశం ముందుకు సాగుతున్నదని చెప్పవచ్చు. దేశ సార్వభౌమత్వం కాపాడుకునే శక్తి సామర్థ్యాలు పెంచుకొన్నది.
భారత్ పాకిస్తాన్ రెండు దేశాలు ఒకే పరిస్థితి లో ప్రయాణం ప్రారంభించిన పాకిస్తాన్ ఆత్మహత్యా సదృశ్యంగా వ్యవహరిస్తూ ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ దాని కోరల్లో తాను చిక్కుకుంటూ భారత్ ను కూడా చిక్కించాలని ప్రయత్నం చేస్తూ తన అస్తిత్వాన్ని కోల్పోయే దిశలో వేగంగా అడుగులు వేస్తున్నది. భారత్ పై విద్వేషం పెంచుకొని ఒక ప్రక్క తనను తాను నాశనం చేసుకుంటూ భారత్ లో అంతర్గత సంఘర్షణలు నిర్మాణం చేయటానికి వ్యూహరచనలు చేస్తున్నది, దానికి సహకరించే శక్తులుమన దేశంలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి, ఆశక్తులతో వ్యవహారం అతి సున్నితంగా, కఠినంగా ఉన్నది. భారత్ ఈ శక్తుల ఆట కట్టించి ప్రపంచంలో రెండు లేక మూడవ ఆర్థిక శక్తిగా ఎదిగే దిశలో అడుగులు పడుతున్నాయి, రాజకీయ స్థిరత్వం సామాజిక ఐక్యత సాధించే దిశలో ప్రయత్నాలు ముమ్మురంగా సాగుతున్నాయి, విధ్వంసరచనతో పుట్టిన పాకిస్తాన్ పడిపోతూ ప్రపంచ పటం నుండి తొలిగి పోయే దిశలో దాని అడుగులు పడుతున్నాయి. భారతదేశంలో ప్రజలు జాగృతమై పాకిస్తాన్ ఎత్తుగడలను వమ్ము చేస్తే ప్రపంచంలో మనకు తిరుగులేదు, అట్లా ప్రజలను సంసిద్ధం చేయటమే ఈ 75 సంవత్సరాల ప్రయాణం మనకు నేర్పుతున్న గుణపాఠం.
Courtesy :- Swarajyam75