బ్లాక్ ఫంగస్ కు హోమియోలో చికిత్స ఉందంటున్నారు నిపుణులు. అందుకోసం హోమియోలో ప్రత్యేక మందులున్నాయని రాష్ట్ర ఆయుష్ విభాగం డైరెక్టర్ డాక్టర్ అలుగు వర్షిణి తెలిపారు. కరోనానుంచి కోలుకుని బ్లాక్ ఫంగస్ బారిన పడిన వారికోసం హోమియోలో ప్రత్యేక మందులున్నాయని ఆమె తెలిపారు. బ్లాక్ ఫంగస్ సోకిన రోగులు ఆర్సెనికం ఆల్బమ్ 200 మెడిసిన్ ను రోజుకు రెండుసార్లు ఆరు మాత్రల చొప్పున ఐదురోజుల పాటు తీసుకోవాలని చెబుతున్నారు. ఫైవ్ ఫాస్ 6 ఎక్స్ మందును రోజుకు రెండుసార్లు మూడు చొప్పున 30 రోజులపాటు వాడితే బ్లాక్ ఫంగస్ పూర్తిగా నయమవుతుందంటున్నారు. తీవ్రత తక్కువగా ఉంటే మాత్రలు ఐదురోజులపాటు వాడితే చాలని..అయితే హోమియో డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవలన్నారు.