నాగాలాండ్లో ఘటనపై కోర్టు ఎంక్వైరీకి ఇండియన్ ఆర్మీ ఆదేశించింది. భద్రతాబలగాలు పౌరులపైకి కాల్పులు జరిపిన ఘటనలో 14 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. మేజర్ జనరల్ ర్యాంక్ అధికారి నేతృత్వంలో ఈ విచారణ జరగనుంది. అటు నాగా లాండ్ ఘటనపై కేంద్రహోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో ప్రకటన చేశారు. ‘సిట్’ దర్యాప్తునకు ఆదేశించామని, 30 రోజుల్లోగా నివేదిక అందజేయాల్సి ఉంటుందని తెలిపారు. ఘటన పూర్వాపరాలను సభకు వివరించారు. ఇక మృతుల కుటుంబాలకు కేంద్రం 11 లక్షల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల చొప్పున ప్రకటించాయి. ఈ ఘటనలో స్థానిక యువకులు మిలిటరీ వ్యాన్లకు నిప్పుపెట్టడంతో ఓ జవాను కూడా చనిపోయాడు.