మూడురోజులపాటు అసోంలో పర్యటించనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆదివారం రాత్రి రాజధాని గువాహటి చేరుకున్న ఆయన అక్కడినుంచి 245 కిలోమీటర్ల దూరంలో ఉన్న సహపరా వద్ద ఇండో-బంగ్లా సరిహద్దును పరిశీలించారు.
అలాగే సరిహద్దు సంబంధిత సమస్యలపై BSF అధికారులతో సమావేశమయ్యారు.
అమిత్ షా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, ఈశాన్య రాష్ట్రాల పోలీసుల కోసం సెంట్రల్ వర్క్షాప్, స్టోర్స్ లను శంకుస్థాపన చేశారు. అలాగే తముల్పూర్ జిల్లాలోని కాల్చేనిలో ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ ఉత్పత్తులను ప్రారంభించారు.
గువాహతికి వెళ్లే మార్గంలో హోం మంత్రి కామ్రూప్ జిల్లాలోని అమింగావ్లో డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ కార్యాలయ భవనాన్ని,అలాగే వర్చ్యువల్ గా SSB భవనాలనూ ప్రారంభించారు.
సాయంత్రం గువాహతి మెడికల్ కాలేజ్ & హాస్పిటల్, నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్శిటీలో 300 పడకల సూపర్ స్పెషాలిటీ యూనిట్ను అమిత్ షా ప్రారంభించనున్నారు. మంగళవారం గువాహతిలో జరిగే ప్రత్యేక పరేడ్ లో అసోం పోలీసులకు రాష్ట్రపతి కలర్ మెడల్ లను ప్రదానం చేస్తారు షా. బీజేపీ నేతృత్వంలో అక్కడ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తైన సందర్భంగా జరిగే వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. నగరంలో జరిగే భారీ బహిరంగసభకు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు కేంద్ర హోంమంత్రి.