థియేటర్లలో విడుదలైన “ది కశ్మీర్ ఫైల్స్” చిత్రం ప్రేక్షకాదరణ పొందుతుంది. చూసిన వారందరూ నాటి భయంకర పరిస్థితులను గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగాలకు గురవుతున్నారు. కశ్మీర్ ఫైల్స్ చిత్రం కాశ్మీర్లోని హిందువులు ఏ విధంగా ఊచకోతకు గురయ్యారో, ముస్లింలు ఎంత దారుణంగా పండిట్లను హింసించారో కళ్ళకు కట్టినట్టు చూపించారు. దీనికి బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం విడుదల సమయంలో ఎన్నో బెదిరింపు కాల్స్ ఎదురుకున్నానని.. సపోర్ట్ చేయకపోగా ఇండస్ట్రీలో నెగెటివ్ టాక్ ప్రచారం చేస్తున్నారని.. పలు ఇంటర్వ్యూలలో వాపోయారు.
దర్శకుడు వివేక్, తన భార్య పల్లవి జోషి సహా ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ పీఎం నరేంద్ర మోదీని శనివారం కలిసి చిత్రం గురించి వివరించారు. తమ శ్రమను గుర్తించినందుకు మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ మూవీ ప్రొడ్యూసర్ ట్వీట్ చేశారు.
https://twitter.com/AbhishekOfficl/status/1502659234319667201?s=20&t=wnfa6Vppb2KDdZjHiiD0rg
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)