దేశాన్ని విచ్ఛిన్నం చేసే మతోన్మాదులు రెచ్చిపోతున్నారు. కానీ ఓ హింసా ప్రవృత్తిని పెంచే జిహాదీ శక్తుల ప్రసంగాలు వామపక్ష వాదులు, సెక్యులర్లు, ఉదార వాదులకు కనిపించడం లేదో, లేదా కళ్లు మూసుకున్నట్టు నటిస్తున్నారో అర్థం కావడం లేదు. ముఖ్యంగా ఇస్లాం మత పెద్దల బెదిరింపులు సాధారణం అయ్యాయి. ఇత్తిహాద్ ఎ మిల్లత్ కౌన్సిల్ పార్టీ…ఎంపీసీ చీఫ్ మౌలానా తౌకీర్ రజా ఖాన్ మరోసారి హిందువులకు వ్యతిరేకంగా ముస్లింలను రెచ్చగొడుతున్న వీడియోను ఓ మీడియా సంస్థ షేర్ చేసింది.
యూపీ బరేలీలో 20 లక్షల మంది ముస్లింలను ఉద్దేశించి ప్రసంగిస్తూ…భారతదేశంలోని హిందువులను వార్నింగ్ ఇచ్చాడు మౌలానా. ముస్లింలు ఆగ్రహోద్రగ్దులైన రోజు హిందువులు తప్పించుకోలేరన్నారని బెదిరించారు.
నేను నాముస్లిం యువతలో ఆగ్రహాన్ని చూస్తున్నా..ఆ ఆగ్రహం ప్రజ్వరిల్లిన రోజు వారిని నియంత్రించడం ఎవరివల్లా కాదు. వారిక పనిలో పడతారేమోనని నాకే భయం వేస్తోంది. అందుకే హిందువులను హెచ్చరిస్తున్నా. అప్పుడు ఈ దేశంలో దాక్కోవడానికి మీరెక్కడా చోటు దొరకదు” అని తీవ్రమైన ద్వేషాన్ని ప్రదర్శిస్తూ హెచ్చరించారు.
మౌలానా తౌకీర్ రజాఖాన్ ఇలాంటి విద్వేష పూరిత ప్రసంగాలు చేయడం ఇదేం మొదటిసారి కాదు. సీఏఏను రద్దు చేయకుంటే దేశంలో రక్తపాతం జరగాలని ఇస్లామిస్టులను రెచ్చగొడ్తూ గత డిసెంబర్లో వ్యాఖ్యానించారు. నేరుగా మోదీని హెచ్చరిస్తూ… “మేం అల్లా బిడ్డలం, మేం చెప్పేది జరుగుతుంది. రక్తపాతం తప్పదు” అని హెచ్చరించాడు. ఒకప్పుడు ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలకు సానుభూతిపరుడిగా ఉన్నాడు తౌకీర్ రజాఖాన్. తాకీర్ ఇలాంటి విద్వేష పూరిత ప్రసంగాలు చేస్తాడని తెలిసి 2009లో కాంగ్రెస్ పార్టీ అతని సపోర్ట్ తీసుకుంది. నాటి లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతిస్తున్నట్టు ఇండియా ఇత్తిహాద్-ఇ-మిల్లత్ కౌన్సిల్ ప్రకటించింది. అంతే కాదు… 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్లకు సీట్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది కూడా. కాంగ్రెస్ కు ముందు నుంచీ మద్దతుగా ఉన్న బరేలీ వర్గానికి చెందిన వాడు మౌలానా. లౌకికశక్తులను ఏకం చేసి బలోపేతం చేసే అవసరం ఉందని అందుకే కాంగ్రెస్ తో కలిసి వెళ్తున్నట్టు ప్రకటించారు. హిందూ టెర్రర్ అనే పదానికి ప్రాచుర్యం కల్పించిన దిగ్విజయ్ సింగ్ నాడు మౌలానాను హీరోగా కీర్తించారు. ఇవాళ లౌకిక శక్తులు కలిసి పోరాడకపోతే మతతత్వ శక్తులు గెలిచేవి అని, బరేల్వి శిష్యులు చాలామంది మనతో ఉన్నారని అందుకే వారిని తిప్పికొట్టగలిగామని అన్నారు.
2009లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోకముందే …ఇస్లామిక్ టెర్రరిజంపై ఆగ్రహంగా ఉన్న నాటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ తలకు 25 కోట్ల రూపాయలు ప్రకటించాడు మౌలానా. దేశంలోని 25 కోట్ల ముస్లింల జనాభాకు అనుగుణంగా ఒక్కొక్కరి తరపున 1 చొప్పున అంటూ ప్రకటించారు.
హిందువుల సామూహిక మారణహోమానికి బహిరంగంగా పిలుపునిచ్చినవాడు మౌలానా తౌకీర్. పదేపదే ఇలాంటి పిలుపులు ఇస్తున్న మౌలానా మాటలు సెక్యులర్, ఉదారవాదులకు మాత్రం కనిపించవు. జిహాద్ పేరుతో ముస్లిమేతరులను నరకమని, రక్తపాతం సృష్టించమని చెబుతుంటే చెవులు, కళ్లు మూసుకున్నారా మానవతావాదులు నిలదీస్తున్నారు.
భారతదేశంలోని నాయకులు, హిందువులు, హిందూమతపెద్దలపై దాడి చేయాలని ఈ ఏడాదిలో 15సార్లు పిలుపునిచ్చాడు మౌలానా.