
తాజాగా బభేశ్ చంద్ర రాయ్ అనే వృద్ధుడు ని హతమార్చారు. ఆయన్ని
ఇంటి నుంచి అపహరించి, కొట్టి చంపినట్టు ‘డెయిలీ స్టార్’ పత్రిక తెలిపింది. ఆ కథనం ప్రకారం, బభేశ్ చంద్రరాయ్ ఇంటికి గురువారం ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ ఆయన భార్య శాంతన రిసీవ్ చేసుకున్నారు. బబేశ్ ఇంట్లోనే ఉన్నారని ఆమె చెప్పారు.
ఒక అరగంట తర్వాత నలుగురు వ్యక్తులు రెండు బైక్లపై వచ్చి బబేష్ను తమవెంట నరబరి గ్రామానికి తీసుకెళ్లారు.
అక్కడ ఆయనపై దారుణంగా దాడి చేశారు. స్పృహ కోల్పోయిన దశలో ఇంటికి చేర్చడంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందారు.
ఈ ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. మైనారిటీల రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటన చేశారు.
“హిందూ మైనారిటీ నేత భబేశ్ చంద్ర రాయ్ను ఇంట్లోంచి అపహరించి, దారుణంగా హత్య చేసినట్టు మా దృష్టికి వచ్చింది. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ పాలనలో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడుల్లో ఇది మరొకటి. ఈ దాడిని మేము ఖండిస్తున్నాం” అంటూ తీవ్ర నిరసన తెలిపారు. “గతంలో ఈ తరహా దాడులకు పాల్పడిన వారు ఎలాంటి శిక్ష లేకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఎలాంటి సాకులు, వివక్ష లేకుండా మైనారిటీలను రక్షించే బాధ్యత తాత్కాలిక ప్రభుత్వం తీసుకోవాలని మరోసారి గుర్తుచేస్తున్నాం” అని రణ్ధీర్ జైశ్వాల్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
అయినప్పటికీ బంగ్లాదేశ్ ప్రభుత్వం లో ఎటువంటి చలనం లేదు. దీంతో అక్కడ హిందువుల భద్రత మీద ఆందోళన వ్యక్తం అవుతోంది.