నిబంధనల పేరుతో హిందువుల పండుగలను కేసీఆర్ సర్కార్ అడ్డుకుంటోందని మండిపడ్డారు బీజేపీ చీఫ్ బండి సంజయ్. హిందూ సమాజం అన్నీ గమనిస్తోందన్నారాయన. వైభవంగా జరుపుకునే వినాయక చవితి వేడుకలను టీఆర్ఎస్ హయాంలో టెన్షన్ వాతావరణంలో జరుపుకోవాల్సి వస్తోందని గుర్తు చేశారు. నిమజ్జనానికీ పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి బాధాకరమన్నారు. హిందువుల పండగ అంటేనే పీస్ కమిటీ మీటింగ్ లు పెడ్తారని విమర్శించారు. ఈసారి నిమజ్జనాలను అడ్డుకోవాలని చూస్తే ట్యాంక్ బండ్ మీద కాదు ప్రగతిభవన్లో నిమజ్జనాలు చూస్తారని హెచ్చరించారు సంజయ్.