హిందీభాష అభివృద్ధి చెందని రాష్ట్రాల భాష అని… తమిళనాడులో ఆభాష అమలుచేస్తే తమిళుల్ని శూద్రులుగా మారుస్తారన్ని డీఎంకే నాయకుడు ఇలంగోవన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి వెనుకబడిన రాష్ట్రాల్లో హిందీ మనకు అక్కర్లేదనే ఉద్దేశం వచ్చేలా ఉన్నాయి ఆయన మాటలు. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, ఒడిశా, పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలకు హిందీ మాతృభాషగా లేదని,ఈ రాష్ట్రాలు అభివృద్ధి చెందిన రాష్ట్రాలనీ ఆయన అన్నారు. హిందీ వల్ల లాభం ఉండదు కదాశూద్రులం అయిపోతాం అని ఆయన అన్నారు.
గతంలో ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయంగా హిందీని ఉపయోగించాలని, ప్రాంతీయ భాషలను కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనపై తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. కొద్ది నెలల క్రితం న్యూఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ అధికార భాషా కమిటీ 37వ సమావేశంలో ఆయన ప్రసంగించారు.
తమిళనాడు విద్యాశాఖ మంత్రి కె. పొన్ముడి కూడా రాష్ట్రంలో హిందీ మాట్లాడేవారిలో ఎక్కువ మంది పానీపూరీలు అమ్ముతూ చిన్నపాటి ఉద్యోగాలు చేయడం వల్ల వారికి ఉద్యోగ అవకాశాలు బలహీనంగా ఉన్నాయని వివాదాన్ని రేకెత్తించారు.