
Supreme Court of India
హిండెన్ బర్గ్ నివేదిక, అనంతర పరిణామాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. లక్షల కోట్లు ఆవిరైన నేపథ్యంలో మదుపర్ల సొమ్మును రక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అందుకు పటిష్టమైన యంత్రాంగం రూపొందించాల్సిన అవసరం ఉందన్న కోర్టు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో నిపుణుల కమిటీ వేయాలని సూచించింది. హిండెన్ బర్గ్ నివేదిక -ఆదానీ గ్రూప్ షేర్ల పతనంపై దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లపై సుప్రీం విచారణ జరిపింది. మదుపుర్ల సొమ్ము భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని, సెబీని కోర్టు అడిగింది. మదుపరులు పదిలక్షల కోట్ల రూపాయలు నష్టపోయారన్న విషయాన్ని పిల్ లో వేశారంటూ ధర్మాసనం ప్రస్తావించింది. ఇలాంటివి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలు, విధివిధానాలపై కేంద్రం, సెబీలు తదుపది విచారణలోగా చెప్పేలా చూడాలని అదనపు సొలిసిటర్ జనరల్ ను తుషార్ మెహతాను ధర్మాసనం ఆదేశించింది.