హిమాలయ,హిందూ మహాసాగరం దేశాల సాం స్కృతిక వారధి భారత్
హిమాలయ హిందూ మహాసాగరంతో సంబంధం ఉన్న దేశాలను కలిపే హెచ్ హెచ్ ఆర్ ఎస్అనే సంస్థ ఒకటి పనిచేస్తున్నది. ఆ సంస్థ2021 జనవరి 29,30తేదీల్లో ఆగ్రాలో రెండు రోజుల అంతర్జాతీయ సం గోష్టి మరియు వెబ్ నార్ కార్యక్రమాన్ని నిర్వహించింది . హిమాలయ హిందూ మహాసాగరం పరివార దేశాలు మొత్తం 54 ఉన్నాయి వీటిలో 37 దేశాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఇటువంటికార్యక్రమము జరగటం ఇది రెండవ సారి. ఈ 54 దేశాలలో జీవన విలువలు సంస్కృతి సాంప్రదాయాలు భారతీయ తో ముడిపడి ఉన్నాయి, ఆ దేశాలకు సాం స్కృతిక వారధిగా గతంలో భారత్ ఒక చక్కటి అనుసంధానం చేసింది. మళ్లీ ఆ దిశలో ప్రయత్నాల ప్రారంభమే ఈ హెచ్ హెచ్ ఆర్ ఎస్ అనే సంస్థ. భారత్ కేంద్రంగా ఈ దేశాల మధ్య ఉన్న సారూప్యతను గుర్తించి వాటిని అనుసంధానం చేయటమే ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం, ఒకప్పుడు ప్రపంచంలోని అనేక దేశాల నుండి ప్రజలు భారత్ దగ్గర కూర్చుని మానవత్వం, జీవన విలువలు నేర్చుకొ నేది ఇక్కడ నేర్చుకున్న విషయాలను తమ దేశాలలో ప్రజలకు బోధించేది, అటువంటి చక్కటి విద్యా వ్యవస్థ ఒకప్పుడు భారత దేశంలో ఉండేది. కానీ ఇప్పుడు మనం ఆ స్థానంలో లేము, భారతదేశంలో విద్యా వ్యవస్థను నాశనం చేయడంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క పాత్రను ఒక సందర్భంలో గాంధీజీ వివరించారు. గాంధీజీ లండన్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎఫైర్స్ అనే వేదిక నుంచి 1931 అక్టోబర్ 20వ తేదీ నాడు ప్రసంగిస్తూ”భారత దేశంలో ఒకప్పుడు ప్రభావవంతమైన విద్యా వ్యవస్థ ద్వారా మానవత్వ విలువలు సాంస్కృతిక విలువలు బోధించే, ఆ విద్యా వ్యవస్థను ఒక క్రమపద్ధతిలో బ్రిటిష్ వాళ్ళు ఎలా నాశనం చేశారో వివరించారు. బ్రిటిష్ వాళ్ళు తమ విద్యా వ్యవస్థ ద్వారా భారతీయ సంస్కృతి, నాగరికత జీవన విలువలను భారతీయుల నుండి దూరం చేసే ప్రయత్నం చేశారు, బ్రిటిష్ వాళ్ళు భారత్ లో అడుగుపెట్టడానికి పూర్వం ఈ దేశంలో ప్రతి నాలుగులేక ఐదు వందల జనాభాకు ఒక పాఠశాల ఉండేది, జనాభా ప్రాతిపదికన ఉన్న ఆ పాఠశాలలను కూడా బ్రిటిష్ వాళ్ళు నాశనం చేశారు . ఈ విషయాలను ప్రముఖ గాంధేయ వాదిధరమ్ పాల్ ” ది బ్యూటిఫుల్ ట్రీ డిస్ట్రాయిడ్ ” అనే పుస్తకంలో వివరించారు. అంతేకాకుండా దక్షిణ ఆసియాను తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా దక్షిణ ఆసియా, ఆగ్నేయ ఆసియా గా విభజించి ఇక్కడి సాంస్కృతిక వారసత్వాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేశారు. ఈ వారసత్వాన్ని కాపాడుకునే దిశగా హెచ్ హెచ్ ఆర్ఎస్ సంస్థ కృషి చేస్తున్నదని ఆ సంస్థ లోని సభ్యులు చెప్పారు. ఈ దేశాలలో ఉమ్మడి సంస్కృతి వారసత్వం మరియు ప్రపంచ ప్రజలందరి సంక్షేమం కాంక్షించే ఆశయాలు ఇక్కడ ఉన్నాయి అందుకే మనం సర్వే భవంతు సుఖినః అని అంటుంటాం దీనిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది . దానికోసం మన మధ్య ఉన్న సారూప్యతను మనం అర్థం చేసుకోవాలి దానిని కాపాడుకొనే దిశలో ప్రయత్నాలు చేయవలసిన అవసరం ఉన్నది. ఇక్కడి ప్రజల సాంస్కృతిక అనుసంధానం హిందూ మహా సాగరమంత లోతు, ఎవరెస్టు శిఖరం అంతా ఎత్తు తో పోల్చవచ్చు. ఈ సంస్కృతిక అనుసంధానం నెట్వర్క్ మరియు ఇక్కడి దేశాల అభివృద్ధి కార్యకలాపాల ద్వారా ఈ ప్రాంతాలను పటిష్టం చేయాలి, ఈ భూమిని దేవభూమి, జ్ఞానభూమి అంటారు, ఆధ్యాత్మిక వారసత్వం ఈ దేశాల ప్రజలందరినీ కలుపుతున్నది, ఈ ప్రాంతాలలో శాంతి శ్రేయస్సు కాపాడటం కోసం అందరం కలిసి పని చేయాలని సభ్యులందరూ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయ కులపతి భగవతీ శర్మ మాట్లాడుతూ” ఒకే సంస్కృతి వారసత్వం ఉన్న ఈ దేశాల ను ఒక దగ్గర కలపటం ఒక శుభసూచకం అని చెప్పారు, ఈ దేశాలు అనుసంధానం చేయడానికి మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్ కారిడార్ ఏర్పాటు చేయాలని , మరియు 54 దేశాల టెక్నో ఎకనామిక్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని” సూచించారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో హెచ్ ఆర్ ఎస్ సంస్థ సమన్వయకర్త ఇంద్రేష్ కుమార్ జి మాట్లాడుతూ” ఈ దేశాలు భౌగోళికంగా రాజకీయంగా వేరు వేరుగా ఉండవచ్చు కానీ ఈ దేశాలు ఒకే సంస్కృతి వారసత్వం కలిగి ఉన్నాయి, మనం అందరం మన సంస్కృతి వారసత్వం ఆధారంగా స్నేహపూర్వక వాతావరణంలో జీవించాలని, మన సంస్కృతి వారసత్వం ద్వారా ప్రపంచాన్ని శాంతియుతంగా ఉంచా లని పిలుపునిచ్చారు. భారతదేశంలో మరియు 54 దేశాల్లో మహిళలను ఎంతో గౌరవప్రదంగా చూస్తుంటాం, భారతీయులు అయితే మహిళలను సంరక్షించడానికి రామ రావణ యుద్ధం, మహాభారత యుద్ధం జరిగిన విషయం అందరికీ తెలుసు, పాశ్చాత్య దేశాలలో మహిళలను మంత్రగత్తెలు గా ముద్ర వేసి కోటి మంది మహిళలను ఊచకోత కోసిన విషయం జ్ఞాపకం చేశారు. హిమాలయ పర్వతాలలో ప్రపంచంలోనే అతిపెద్ద నీటి వనరులు ఖనిజ వనరులు మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక సాధన చేయాలనుకునే వాళ్ళందరిని హిమాలయాలు తన దగ్గరకుచేర్చుకొంటుంది భారత్ లో మనం జన్మించిన ఈ భూమిని తల్లిగా భావిస్తుండటం. ప్రాచీన కాలం నుండి ఈ దేశాల అనుసంధానం కోసం ఉమ్మడి వాణిజ్యం దానికోసం సిల్క్ రూట్ మరియు సముద్ర మార్గం ఓడరేవులు ఏర్పాటు చేసుకుని పనిచేసిన విషయం మనం గుర్తు చేసుకోవాలి. ఈదేశాల మొత్తం జనాభా ప్రపంచ జనాభాలో 40 శాతం ఉన్నది, ప్రపంచంలో భారత్ మానవత్వ విలువలు ప్రధానంగా ఉంటే, చైనా ఆక్రమణ హింసాత్మక విలువలతో ఉంటే పాశ్చాత్య దేశాలు వినియోగంవాదం ద్వారా ప్రజలను దోచుకుంటూ ఉండేది. కరోనా మహమ్మారి సమయంలో కూడా భారత్ హనుమంతుడిలాగ సంజీవని అనే కరోనా వ్యాక్సిన్ మో సుకుని వచ్చింది. ఈ దేశాలు రాజకీయంగా భౌగోళికంగా భిన్నంగా ఉండవచ్చు కానీ సాంస్కృతికంగా ఒక్కటిగా శతాబ్దాలుగా చెక్కుచెదరకుండా ఉన్నది. ఈ అన్ని దేశాలలో రామాయణం రాముడు జీవితంతో సంబంధాలున్నాయి. ప్రపంచంలో 137 దేశాలకు రామాయణం రాముడు తో సంబంధాలు ఉన్నాయని ఆధునిక పరిశోధనలు కూడా నిరూపిస్తున్నాయి, ఈ దేశాలన్నీ ఒక్కటిగా కలిసి ఉంటే విభేదాలు లేని ప్రపంచాన్ని మనం నిర్మాణం చేయవచ్చు ఈ దేశాల అనుసంధానం కోసమే హెచ్ ఆర్ ఎస్ అనేస్వచ్చంధ సంస్థ పనిచేస్తున్నది. ఇలాంటి సమావేశాలు అప్పుడప్పుడూ నిర్వహించుకుంటూ మనం మన మధ్య ఉన్న సాంస్కృతిక సారూప్యతలను జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కటిగా ఉండాలని” పిలుపునిచ్చారు