హిజాబ్ ధరించాల్సింది పాఠశాలల్లో కాదని…అసలు హిజాబ్ ఆణచివేతకు చిహ్నమని ప్రముఖ బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్ అన్నారు. కర్నాటకలో హిజాబ్ వ్యవహారం దుమారం రేపుతున్న నేపథ్యంలో ఆమె స్పందించారు.
కొందరు హిజాబ్ ను తప్పనిసరి అని ఎందుకు అనుకుంటారని ఆమె ప్రశ్నించారు. 7 వశతాబ్దంలో మహిళా ద్వేషులు దాన్ని ప్రవేశపెట్టారని ఆమె అన్నారు. మహిళను శృంగార వస్తువుగా చూసేవాళ్లు…ఇతర పురుషుల కళ్లు ఆమెపై పడకుండా ఉండేందుకు హిజాబ్, నిఖాబ్, బుర్ఖాలను తీసుకువచ్చారని అన్నారు. ఇప్పుడీ 21 వ శతాబ్దంలో మహిళ అన్నింటా సమానమంటూ దూసుకెళ్తుంటే…వాటితో పనేంటని ఆమె ప్రశ్నిస్తున్నారు. పాఠశాలలు, కాలేజీల్లో అందరూ సమానమే అనే భావన ఉండాలి. అందుకే డ్రెస్ కోడ్ పెట్టారు. ఆ నిబంధనను పాటించకుంటే ఎలా అని ఆమె అన్నారు. మతం కన్నా చదువు ముఖ్యమని… మతవిశ్వాసాలు ఇంటి దగ్గరో మరో చోటనే ఆచరించాలి తప్ప లౌకికవాద విద్యా కేంద్రాల్లో కాదనీ ఆమె చెప్పారు. అక్కడ వ్యక్తి గుర్తింపు మతపరమైన గుర్తింపుగా ఉండకూడదన్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)