శబరిమలై లో మకర విళక్క్ సీజన్ ముగిసింది. దాదాపు రెండు నెలల పాటు జరిగిన మకర విళక్క్ సీజన్ లో సుమారు 440 కోట్ల రూపాయల మేర ఆదాయం సమకూరింది. గత ఏడాది కంటే ఇది 86 కోట్ల మేర అధికం.
వాస్తవానికి అయ్యప్ప స్వామి దేవాలయానికి వచ్చే ఆదాయం అంతకంతకూ పెరుగుతూ వస్తుంది. కానీ ఈ సారి మాత్రం చాలా పెద్ద స్తాయిలో ఆదాయం సమకూరటం విశేషం. ఈ సీజన్ శబరిమలను దర్శించుకున్న భక్తుల సంఖ్యం సుమారు 55 లక్షల మందిగా చెబుతున్నారు. అయ్యప్ప స్వామి ఆలయానికి ప్రస్తుత మండల-మకరవిళక్కు సీజన్లో రూ.440 కోట్లకుపైగా ఆదాయం వచ్చినట్టు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) ప్రకటించింది. గత ఏడాదితో పోల్చితే ఇది రూ.86 కోట్లు అధికమని దేవస్వం బోర్డు చైర్మన్ పీఎస్ ప్రశాంత్ వెల్లడించారు. గత ఏడాది రూ.354 కోట్ల ఆదాయం వచ్చినట్టు తెలిపారు. సాధారణంగా ప్రతి ఏటా సుమారు రూ. 4-5 కోట్ల మేర ఆదాయం పెరుగుతుందని, కానీ ఈ ఏడాది భారీగా పెరిగిందని ఆయన అన్నారు.
కరోనా సమయంలో శబరిమలై వెళ్లే భక్తుల సంఖ్య కొంత మేర తగ్గింది కానీ, తర్వాత నుంచి ఇది క్రమంగా పుంజుకొంది. ఈ ఏడాది విస్తారంగా యాత్రికులు శబరిమలై కు వెళ్లినట్లు తెలుస్తోంది. ‘