అనుమతి ఉంటేనే రాష్ట్రంలోకి ఎంట్రీ అంటూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్ట్ స్టే విధించింది..
గతంలో తాము జారీ చేసిన ఉత్తర్వులను పట్టించుకోకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కరోనా నేపథ్యంలో ఏపీ నుంచి తెలంగాణ లోకి వచ్చేవాళ్లు ముందుగా అనుమతి తీసుకోవాలంటూ టీఆర్ఎస్ సర్కారు ఉత్తర్వులిచ్చింది. దీంతో సరిహద్దుల్లో ఆంబులెన్సులు సహా అన్ని వాహనాలనూ కూడా నిలిపేస్తున్నారు. ఏపీలో ఆక్సిజన్ అందక హైదరాబాద్ లో వైద్యం కోసం వస్తున్న రోగులనూ అడ్డుకుంటున్న పరిస్థితి. సకాలంలో వైద్యం అందక పలువురి ప్రాణాలు గాల్లో కలిశాయి..
సరిహద్దుల్లో అంబులెన్సులు నిలిపివేత పై హైకోర్టు స్పందించింది…ఆగ్రహం వ్యక్తంచేసింది. ఉత్తర్వులను నిలిపివేయమంది…తదుపరి విచారణ ఈనెల 17కు వాయిదా వేసింది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం