మాలేగావ్ పేలుళ్ల కేసునుంచి విముక్తి కల్పించాలని కోరుతూ ప్రధాన నిందితుడు లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్ చేసిన విజ్ఞప్తిని ముంబై హైకోర్టు తోసిపుచ్చింది. 2008 సెప్టెంబర్లో జరిగిన పేలుడు కేసులో ఆరుగురు మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులో బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ సహా పురోహిత్, మరో ఆరుగురు విచారణను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వీరంతా బెయిలుపై ఉన్నారు.కాగా, ఈ కేసు నుంచి విముక్తి కల్పించాలంటూ శ్రీకాంత్ పురోహిత్ చేసిన వాదనను న్యాయమూర్తులు ఏఎస్ గడ్కరి, ప్రకాష్ నాయక్లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో మతపరంగా అత్యంత సున్నిత ప్రాంతంగా పేరున్న మాలేగావ్లో 2008 సెప్టెంబర్ 29న భారీ పేలుడు చోటుచేసుకుంది. ఆరుగురు ప్రాణాలు కోల్పోగా,100 మందికి పైగా గాయపడిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది.