రేపటి వరంగల్ బీజేపీ సభకు హైకోర్ట్ అనుమతిచ్చింది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా అక్కడ సభ నిర్వహించాలని బీజేపీ అనుకుంది. అయితే పోలీసులు సభకు అనుమతివ్వలేదు. అనుమతికోరుతూ బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. సభకు అనుమతిచ్చింది ధర్మాసనం. పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వరంగల్ సభకు హాజరుకానున్నారు.
అటు వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఆంక్షలు విధించారు వరంగల్ సీపీ తరుణ్ జోషి. బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేధం విధించారు. నగరంలో శుక్రవారం నుంచి 30 – సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తూ తరుణ్ జోషి ఉత్తర్వులిచ్చారు. శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. పోలీసు ఆంక్షలు ఇవాళ్టి నుంచి ఈ నెల 31 వరకు అమల్లోఉంటాయి. అయితే సీపీ ఆంక్షల నేపథ్యంలో బీజేపీ మాత్రం సభకు అనుమతి తెచ్చుకుంది.