వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. ఆయనను సోమవారం వరకు అరెస్ట్ చేయవద్దని సీబీఐకి హైకోర్టు శనివారం ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో కేసు పూర్తి వివరాలను సమర్పించాలనీ సీబీఐని ఆదేశించింది. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో మరోసారి విచారణకు రావాలంటూ అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఆరోతేదీన హైదరాబాద్ లోని తమ కార్యాలయానికి రావాలని అందులో పేర్కొంది. అయితే ఆ రోజు వేరే కార్యక్రమాలు ఉన్నందున రాలేనని బదులిచ్చారు. దీంతో పదోతేదీన రావాలని మరోసారి సీబీఐ నోటీసులిచ్చింది. ఇవాళ ఆయన విచారణకు హాజరుకావాల్సి ఉండగా..కోర్టును ఆశ్రయించారు.